బ్యాటరీ మింగేసిన బాలుడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడేళ్ల బాలుడు రిమోట్‌ బ్యాటరీ మింగేశాడు. ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామానికి చెందిన శివకృష్ణ, లక్ష్మి కుమారి దంపతులకు చెందిన మూడేళ్ళ చందు అనే బాలుడు ఆడుకుంటూ మ్యూజిక్ ప్లేయర్ కు ఉపయోగించే రిమోట్ లోని బ్యాటరీని నోట్లో పెట్టుకుని మింగేశాడు. దీంతో అస్వస్థతకు గురికావడంతో గమనించిన తల్లిదండ్రులు బాలుడ్నిఆస్పత్రికి తరలించారు. దాదాపుగా అరగంట పాటు శ్రమించిన వైద్యులు ఎట్టకేలకు బ్యాటరీని బయటకు తీశారు. బ్యాటరీలో కెమికల్‌ పేగుల్లో అతుకుపోవటంతో ఆపరేషన్‌ కష్టంగా […]

బ్యాటరీ మింగేసిన బాలుడు
Follow us

|

Updated on: Sep 21, 2019 | 4:25 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడేళ్ల బాలుడు రిమోట్‌ బ్యాటరీ మింగేశాడు. ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామానికి చెందిన శివకృష్ణ, లక్ష్మి కుమారి దంపతులకు చెందిన మూడేళ్ళ చందు అనే బాలుడు ఆడుకుంటూ మ్యూజిక్ ప్లేయర్ కు ఉపయోగించే రిమోట్ లోని బ్యాటరీని నోట్లో పెట్టుకుని మింగేశాడు. దీంతో అస్వస్థతకు గురికావడంతో గమనించిన తల్లిదండ్రులు బాలుడ్నిఆస్పత్రికి తరలించారు. దాదాపుగా అరగంట పాటు శ్రమించిన వైద్యులు ఎట్టకేలకు బ్యాటరీని బయటకు తీశారు. బ్యాటరీలో కెమికల్‌ పేగుల్లో అతుకుపోవటంతో ఆపరేషన్‌ కష్టంగా మారిందన్నారు. ప్రస్తుతం బాలుడి క్షేమంగా ఉన్నాడని వైద్యులు వెల్లడించారు. చిన్నారికి ప్రాణపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.