MLA Jeevan Reddy: నోరు అదుపులో పెట్టుకోవాలి.. ఎంపీ అర్వింద్పై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణలో రాజకీయం మరింత హీటెక్కింది.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యల నాటినుంచి.. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. తాజాగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో రాజకీయం మరింత హీటెక్కింది.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యల నాటినుంచి.. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. తాజాగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అరవింద్ నోరు అదుపులో పెట్టుకోవాలంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాము తలుచుకుంటే ఒక్క బీజేపీ నేత రోడ్డుపైకి రాలేరంటూ జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా MP అర్వింద్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. నిజామాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. బీజేపీ ఎంపీ అరవింద్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఆదేశాలతో తాము చాలా ఒపిగ్గా ఉంటున్నామని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఎంపీ అరవింద్ ఒక ఫేకర్చ, వాళ్ల నాన్న జోకర్ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అరవింద్ చదివింది ఫేక్, రాసిచ్చిన బాండ్ ఫ్రాడ్, మాట్లాడేది ఫాల్స్ అంటూ జీవన్ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ కుటుంబం ఫైటర్స్ ఫ్యామిలీ అని, అరవింద్ కుటుంబం చీటర్స్ ఫ్యామిలీ అంటూ ఎద్దెవా చేశారు. ఒకే ఇంట్లో మూడు పార్టీల వారు ఉన్నారన్నారు. కవిత చెప్పుతో కొట్టడం అనేది చిన్న మాట అని.. ఇంకోసారి కేసీఆర్ ఫ్యామిలీ గురించి అరవింద్ మాట్లాడితే.. ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలో ఉరికించి కొడతామంటూ హెచ్చరించారు.
Pressmeet Held at Nizamabad Dist TRS Party Office. pic.twitter.com/uofZja9jf3
— Jeevan Reddy MLA (@jeevanreddytrs) November 20, 2022
ఆర్మూర్ ప్రజలు అరవింద్ను ఓడించేందుకు ఎదురు చూస్తున్నారంటూ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కరెంటు గురించి మాట్లాడే అరవింద్.. ఒకసారి కరెంట్ వైర్లను పట్టుకుంటే తెలుస్తుందన్నారు. అరవింద్ క్షమించమని వేడుకునే వరకు వెంటాడుతూనే ఉంటామని ఎమ్మేల్యే జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..