Bandi Sanjay: లిస్ట్‌లో రాసుకున్నా.. దమ్ముంటే రౌడీలను, గూండాలను పట్టుకోవాలి.. వరంగల్‌ సీపీపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు

సీపీకి దమ్ముంటే రౌడీలను, గూండాలను పట్టుకోవాలని వ్యాఖ్యానించారు. పాలకుర్తిలో పాదయాత్ర చేసిన బండి సంజయ్‌ అక్కడ షాపులు మూయించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

Bandi Sanjay: లిస్ట్‌లో రాసుకున్నా.. దమ్ముంటే రౌడీలను, గూండాలను పట్టుకోవాలి.. వరంగల్‌ సీపీపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు
Bandi Sanjay
Follow us

|

Updated on: Aug 16, 2022 | 4:41 PM

వరంగల్‌ సీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సీపీ పేరు లిస్ట్‌లో రాసుకున్నానని.., సంగతి చూస్తామని హెచ్చరించారు. సీపీకి దమ్ముంటే రౌడీలను, గూండాలను పట్టుకోవాలని వ్యాఖ్యానించారు. పాలకుర్తిలో పాదయాత్ర చేసిన బండి సంజయ్‌ అక్కడ షాపులు మూయించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఇవాళ బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర విస్నూరు గ్రామం నుంచి మొదలైంది. విస్నూరు గ్రామంలోని శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శించిన బండి సంజయ్ అనంతరం పాదయాత్రగా ప్రారంభించారు. అయితే బండి సంజయ్ పాదయాత్ర పాలకుర్తికి చేరుకుని, అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో నిజాం పాలన సాగుతోందని విమర్శించారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని మార్చేందుకే ప్రజాసంగ్రామ యాత్రను మొదలు పెట్టానన్నారు. ప్రజాసంగ్రామ యాత్రతో కేసీఆర్ పునాదులు కదులుతున్నాయన్నారు. మాకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మాపై దాడులు చేస్తున్నారని, కేసులు పెడుతున్నారని విమర్శించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఒకవేళ సర్కారు చేయని పక్షంలో మెడలు వంచి జరిపిస్తామన్నారు.

కేటీఆర్ డీజే టిల్లు అని, ముఖ్యమంత్రిని పాస్ పోర్టు బ్రోకర్ అని విమర్శించారు. ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు. హుజూరాబాద్ లో ఓటుకు పదివేలు ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో రూ.30 వేలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. కేసీఆర్ ఇచ్చే పైసలు తీసుకొని బీజేపీకి ఓటేసి గడీల పా లన అంతం చేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం