భద్రాద్రి రాముడి కల్యాణానికి సుముహూర్తం ఖరారు

భద్రాద్రి: భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణానికి ఆలయ వేద పండితులు, అర్చకులు ముహూర్తం ఖరారు చేశారు. ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి 20 వరకు శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 14న సీతారాముల కల్యాణం, 15న మహా పట్టాభిషేకం నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణం భక్తులు తిలకించేందుకు మిథిలా ప్రాంగణంలో సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా రూ.5 వేలు, రూ.2 వేలతోపాటు ఇతర టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచారు. సీతారాముల కల్యాణాన్ని వీక్షించే భక్తులు  ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లను […]

భద్రాద్రి రాముడి కల్యాణానికి సుముహూర్తం ఖరారు
Follow us

|

Updated on: Mar 07, 2019 | 4:40 PM

భద్రాద్రి: భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణానికి ఆలయ వేద పండితులు, అర్చకులు ముహూర్తం ఖరారు చేశారు. ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి 20 వరకు శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 14న సీతారాముల కల్యాణం, 15న మహా పట్టాభిషేకం నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణం భక్తులు తిలకించేందుకు మిథిలా ప్రాంగణంలో సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా రూ.5 వేలు, రూ.2 వేలతోపాటు ఇతర టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచారు. సీతారాముల కల్యాణాన్ని వీక్షించే భక్తులు  ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.