Robbery: అరెరే ప్లాన్ రివర్స్ అయ్యిందే.. ఇంట్లోకి దూరి ఉప్మా వండుకుని తిన్న దొంగలు.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..

మహబూబాబాద్ జిల్లాలో విచిత్ర దోపిడీ దొంగలు ఊహించని విధంగా పట్టుబడ్డారు.. ఎవరూలేని ఇంట్లో ఉప్మా చేసుకొని తిని మరీ ఇళ్ళు లూఠీకి పాల్పడ్డ ఆ దొంగలను పట్టుకొని కట్టేసిన గ్రామస్థులు ఉతికి ఆరేసి పోలీసులకు..

Robbery: అరెరే ప్లాన్ రివర్స్ అయ్యిందే.. ఇంట్లోకి దూరి ఉప్మా వండుకుని తిన్న దొంగలు.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..
Robbery
Follow us

|

Updated on: Jan 19, 2023 | 9:42 AM

మహబూబాబాద్ జిల్లాలో విచిత్ర దోపిడీ దొంగలు ఊహించని విధంగా పట్టుబడ్డారు.. ఎవరూలేని ఇంట్లో ఉప్మా చేసుకొని తిని మరీ ఇళ్ళు లూఠీకి పాల్పడ్డ ఆ దొంగలను పట్టుకొని కట్టేసిన గ్రామస్థులు ఉతికి ఆరేసి పోలీసులకు అప్పగించారు. ఈ వింత చోరీ సంఘటన మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో జరిగింది. తాళ్లపెల్లి రమేష్ – రుద్ర దంపతులు ఇంటికి తాళం వేసి ఊరెళ్ళారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ఇద్దరు దుండగులు కిటికీలు బద్దలుకొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో ఎవరికీ అనుమానం రాదని భావించి దర్జాగా ఉప్మా చేసుకొని తిన్నారు.

కడుపు నిండా ఉప్మా తిన్న తర్వాత ఇంట్లోని సామాన్లన్నీ సర్దుకొని ఊడాయించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఊహించని విదంగా గ్రామస్తులకు చిక్కారు దొంగలు. గ్రామస్తులు పట్టుకునే ప్రయత్నంలో ఒకరు తప్పించుకొని పారిపోగా మరో దొంగ పట్టుబడ్డాడు. అతన్ని చెట్టుకు కట్టేసి చితకబాదిన గ్రామస్థులు.. దేహశుద్ధి అనంతరం పోలీసులకు అప్పగించారు. చోరీకి పాల్పడ్డ దొంగలు నల్గొండ జిల్లాకు చెందిన వారుగా భావిస్తున్నారు. కాగా, ఈ చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles