శ్రావణి కేసు: పోలీసుల కస్టడీకి సాయి కృష్ణ, దేవరాజ్‌

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం చంచలగూడ జైలులో ఉన్న సాయికృష్ణ, దేవరాజ్‌ రెడ్డి లను

శ్రావణి కేసు: పోలీసుల కస్టడీకి సాయి కృష్ణ, దేవరాజ్‌
Follow us

| Edited By:

Updated on: Sep 26, 2020 | 2:36 PM

Sravani death Case: బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం చంచలగూడ జైలులో ఉన్న సాయికృష్ణ, దేవరాజ్‌ రెడ్డి లను ఎస్సార్ నగర్ పోలీసుల కస్టడీకి తీసుకున్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఈ ఇద్దరిని తిరిగి పోలీసు కస్టడీకి తీసుకున్నారు. వీరిని మరో మూడు రోజుల పాటు విచారించి శ్రావణి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకోనున్నారు. అలాగే సీన్‌ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నారు. ముగ్గురు నిందితుల సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేపట్టనున్నారు. శ్రావణి ఆత్మహత్యకు ముందు జరిగిన గొడవలపై విచారణ కొనసాగనుంది. ఆత్మహత్యకు ముందు ముగ్గురి మధ్య ఎం జరిగిందో పోలీసులు తేల్చనున్నారు. ప్రేమిస్తున్నట్లు నటించి శ్రావణిని బ్లాక్‌మెయిల్ చేసి తీవ్రంగా వేధింపులకు గురి చేయడానికి గల కారణాలను తెలుసుకోనున్నారు. అయితే ఈ ఇద్దరితో పాటు నిర్మాత అశోక్‌ రెడ్డిని పోలీసులు ఇంకా కస్టడీలోకి తీసుకోలేదు.

Read More:

Breaking: ఇంట్లో జారి పడ్డ నన్నపనేని.. తలకు గాయం

Bigg Boss 4: ఈ వారం ఎలిమినేట్‌ అవ్వనున్న మెహబూబ్‌..!