Jogulamba-Gadwal District News: తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఇటిక్యాల మండలం మంగపేట వద్ద కృష్ణా నదిలో నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. మంగంపేటలోని కృష్ణా నది చూసేందుకు చిన్నారులు ఉదయాన్నే అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు. అనంతరం నీటి ప్రవాహంలో లోతట్టు ప్రాంతంలోకి వెళ్లడంతో నీటిలో మునిగి గల్లంతయినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం నీటిలో మునిగిన చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు.
మృతులను ఆఫ్రిన్ (17), రిహాన్ (15), సమీర్ (8), నౌసిన్ (7) గా పోలీసులు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు చనిపోవడంతో..గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉదయాన్నే నవ్వుకుంటూ వెళ్లిన చిన్నారు.. విగత జీవులుగా కనిపించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
11 మంది చిన్నారులు కృష్ణానది ప్రాంతాన్ని చూడడానికి ఉదయాన్నే ఆటోలో వెళ్లారు. ఈ తరుణంలోనే ఊహించని ప్రమాదం చోటుచేసుకుందని కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..