CPI Narayana: గిరిజనుల మెడపై కత్తి పెట్టేందుకే ముర్మును రంగంలోకి దింపారు.. నారాయణ సెన్సేషనల్ కామెంట్స్‌..

CPI Narayana: ఇటీవల సంచలన కామెంట్స్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు సీపీఐ నారాయణ. మొన్నటి మొన్న చిరంజీవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, అనంతరం క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదానికి ఇలా ఫుల్ స్టాప్ పడిందో లేదో మరోసారి..

CPI Narayana: గిరిజనుల మెడపై కత్తి పెట్టేందుకే ముర్మును రంగంలోకి దింపారు.. నారాయణ సెన్సేషనల్ కామెంట్స్‌..
Cpi Narayana
Follow us

|

Updated on: Jul 25, 2022 | 7:39 AM

CPI Narayana: ఇటీవల సంచలన కామెంట్స్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు సీపీఐ నారాయణ. మొన్నటి మొన్న చిరంజీవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, అనంతరం క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదానికి ఇలా ఫుల్ స్టాప్ పడిందో లేదో.. మరోసారి సంచనల కామెంట్స్‌ చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలో జరిగిన సీపీఐ మహాసభల్లో ప్రధాని మోదీ, బీజేపీని టార్గెట్‌ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏలాలని చూస్తున్నారన్నారు. కమ్యూనిస్టులు బలంగా ఉంటే, దేశాన్ని అమ్ముకోనివ్వరనే వరవరరావు, సాయిబాబా లాంటివారిని జైల్లో పెట్టారని ఆరోపించారు.

నారాయణ ఇంకా మాట్లాడుతూ.. ‘ఆదివాసీ మహిళ ద్రౌపతి ముర్మును రాష్ట్రపతిని చేసి, గొప్పులు చెప్పుకుంటున్నారు. ముర్ము రాష్ట్రపతి అయితే గిరిజనుల జీవితాలు ఎలా మారిపోతాయో చెప్పాలి. నిజంగానే అలాంటి పరిస్థితి ఉంటే, ముందు మంచిర్యాల జిల్లాలోని గిరిజనుల సమస్యను పరిష్కరించాలి. ఆదివాసీ మహిళ ద్రౌపతి ముర్మును రాష్ట్రపతిని చేయడం కాదు, ముందు గిరిజనుల సమస్యలపై దృష్టి పెట్టండి. అప్పుడైనా, ఇప్పుడైనా గిరిజనుల హక్కుల కోసం పోరాడుతోన్న ఒకే ఒక్క పార్టీ సీపీఐ మాత్రమే. గిరిజనుల మెడపై కత్తి పెట్టేందుకే ముర్మును బీజేపీ వాడుకుంటోంది. ఇప్పటికే 24 పబ్లిక్ లిమిటెడ్‌ కంపెనీలను అమ్మేశారు, ఇప్పుడు మరో వంద సంస్థలను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. 89మంది బ్యాంకులకు అప్పులు ఎగ్గొడితే, అందులో 29మంది గుజరాతీలే ఉన్నార’ని విమర్శించారు. ఇక తెలంగాణలోనూ నియంత పాలన నడుస్తోందన్న నారాయణ, వరద బాధితులను ఆదుకోకపోతే సీపీఐ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles