మామిడికాయ పచ్చడి పెట్టిన మంత్రి సబితా

నిత్యం అధికారిక కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉండే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ఇంట్లో మామిడి కాయ పచ్చడి పెట్టేందుకు సమయం కేటాయించారు. మామిడి కాయ తొక్కు అంటే ఇష్టం లేని వారు తెలుగు రాష్ట్రల్లో ఉండరేమో. ఎంత ధనికులు అయినా, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా కొత్త మామిడి కాయ తొక్కు రుచికి ఫిదా అవ్వాల్సిందే. లాక్ డౌన్ పుణ్యమాని ప్రతిఒక్కరూ ఏదోక పని చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఒకరు రుచికరమైన వంటలు చేస్తుంటే, మరొకరు […]

మామిడికాయ పచ్చడి పెట్టిన మంత్రి సబితా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 28, 2020 | 5:04 PM

నిత్యం అధికారిక కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉండే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ఇంట్లో మామిడి కాయ పచ్చడి పెట్టేందుకు సమయం కేటాయించారు. మామిడి కాయ తొక్కు అంటే ఇష్టం లేని వారు తెలుగు రాష్ట్రల్లో ఉండరేమో. ఎంత ధనికులు అయినా, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా కొత్త మామిడి కాయ తొక్కు రుచికి ఫిదా అవ్వాల్సిందే. లాక్ డౌన్ పుణ్యమాని ప్రతిఒక్కరూ ఏదోక పని చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఒకరు రుచికరమైన వంటలు చేస్తుంటే, మరొకరు ఇంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదే కోవలో పచ్చడి తయారీ చేస్తూ సందడి చేశారు మంత్రి. తాము స్వయంగా పచ్చడ తయారు చేసిన దృశ్యాలను ప్రజలతో షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన భర్త మాజీ మంత్రి మంత్రిగా ఉన్నప్పుడు పొలం పనులు చేసిన సంఘటనను గుర్తు చేస్తూ నేనూ సగటు మహిళనే అన్న తీరులో పచ్చడి తయారీ చేశారు. పెద్ద హోదాలో ఉన్నా ఇంట్లో అమ్మనే అని సమాజానికి సందేశం ఇచ్చారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.