కరోనా కేసులు.. తమిళనాడులో 3,882.. కేరళలో 151..

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్నకరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఆ తర్వాత తమిళనాడులో..

కరోనా కేసులు.. తమిళనాడులో 3,882.. కేరళలో 151..
Follow us

| Edited By:

Updated on: Jul 01, 2020 | 7:48 PM

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్నకరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఆ తర్వాత తమిళనాడులో నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం నాడు తమిళనాడులో కొత్తగా మరో 3,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 94,049కి చేరింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 39,856 యాక్టివ్ కేసులు ఉన్నాయని తమిళనాడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 52,926 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.

ఇక కేరళలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా బుధవారం నాడు కొత్తగా మరో 151 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేరళ సీఎం పినరయ్ విజయన్ తెలిపారు. బుధవారం నాడు కరోనా నుంచి కోలుకుని 131 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,130 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. రాష్ట్రంలో 124 హాట్‌స్పాట్‌లు ఉన్నాయని పినరయ్ విజయన్ తెలిపారు.