Rohit Sharma Key Update on Rishabh Pant: బెంగళూరులో జరిగిన మొదటి టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ మోకాలికి దెబ్బ తగిలింది. ఇదే కాలికి ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో అతని మోకాలికి తీవ్ర గాయమైంది. అతను బెంగళూరులో గాయపడినప్పుడు, విపరీతమైన నొప్పితో కనిపించాడు. మైదానం వదిలి వెళ్ళవలసి వచ్చింది. ఈ సంఘటన తర్వాత, అతను మ్యాచ్ మొత్తంలో మళ్లీ వికెట్ కీపింగ్ కోసం రాలేదు. అయితే, రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన పంత్ 99 పరుగులు చేశాడు. పూణె టెస్టులో ఆడేందుకు సంబంధించి రోహిత్ శర్మ చేసిన ప్రకటన నుంచి కీలక అప్డేట్ వచ్చింది.
తొలి టెస్టు అనంతరం విలేకరుల సమావేశంలో రోహిత్ మాట్లాడుతూ.. “పంత్కు మోకాలికి ఆపరేషన్ జరిగింది. జాగ్రత్తగా ఉండటం మంచిది. అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పరిగెత్తడం సౌకర్యంగా ఉండదు. మేం చాలా జాగ్రత్తగా ఉండాలి. అతను గత కొన్నేళ్లుగా చాలా బాధపడ్డాడు, నొప్పితో జీవిస్తున్నాడు. కాబట్టి తదుపరి టెస్టుకు ముందు అతనికి అదనపు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు.
రవీంద్ర జడేజా వేసిన బంతి నేరుగా వెళ్లి పంత్ మోకాలికి తాకింది. దేశం మొత్తం అతని కోసం ఆందోళన చెందింది. అయితే, మూడో రోజు టీ టైమ్లో ప్యాడ్లు వేసుకుని మైదానంలో ప్రాక్టీస్ చేయడానికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మూడో రోజు పంత్ రాక అతను రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగుతున్నట్లు తెలిపాడు.
సాధారణంగా టెస్టు క్రికెట్లో దూకుడిగా ఆడే పంత్.. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో చాలా తెలివిగా బ్యాటింగ్ చేశాడు. మంచి బంతులకు పూర్తి గౌరవం ఇవ్వడంతో పాటు దూకుడు షాట్లపై కూడా చక్కటి నియంత్రణను కనబరిచాడు. పంత్ మంచి రిథమ్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. తొంభైలకు చేరుకున్న తర్వాత, అతను 107 మీటర్ల పొడవైన సిక్స్ కొట్టడం ద్వారా తన ఉద్దేశాలను మరింత స్పష్టంగా చెప్పాడు.
అయితే, పంత్ ఒక పరుగు తేడాతో సెంచరీని కోల్పోవడంతో దురదృష్టకరం. స్కోరు 99 వద్ద, విలియం ఓ’రూర్క్ బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బాల్ను కట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పంత్ ఔట్ అయ్యాడు. అతని ఏడో టెస్ట్ సెంచరీని స్కోర్ చేయలేకపోయాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..