Border-Gavaskar Trophy: తొలి టెస్ట్ కు ముందే మైండ్ గేమ్ స్టార్ట్ చేసిన లాబుషేన్..

మార్నస్ లాబుషేన్ భారత జట్టు న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో ఎదుర్కొన్న వైట్‌వాష్‌ను ప్రస్తావిస్తూ ఆత్మవిశ్వాసంపై దాని ప్రభావం చూపవచ్చని అన్నారు. భారత జట్టు 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో గాయాలతో కూడిన పరిస్థితుల్లో చారిత్రక విజయాన్ని సాధించిన ఉదాహరణను గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ సిరీస్ WTC ఫైనల్‌కు చేరుకోవడానికి భారత జట్టుకు కీలకమైనది.

Border-Gavaskar Trophy: తొలి టెస్ట్ కు ముందే మైండ్ గేమ్ స్టార్ట్ చేసిన లాబుషేన్..
Labuschagne

Updated on: Nov 19, 2024 | 9:43 PM

పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ప్రారంభమవుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీకి ముందు, ఆస్ట్రేలియా నంబర్ 3 బ్యాటర్ మార్నస్ లాబుషేన్ టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశాడు. భారత జట్టు ఇటీవల న్యూజిలాండ్ చేతిలో ఎదుర్కొన్న వైట్‌వాష్‌ను ప్రస్తావించిన లబుషైన్..
ఈ 3-0 సిరీస్ ఓటమి భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని కొంతమేరకు దెబ్బతీసి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, భారత జట్టు ప్రతిభాపాటవాలను తక్కువ అంచనా వేయడం పెద్ద పొరపాటు అవుతుందని లాబుషేన్ అన్నారు.

భారత జట్టు 12 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓటమి చెందగా, ఇది మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లో వైట్‌వాష్ అవడం తొలి సారి కావడం గమనార్హం. రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల ఆస్ట్రేలియాకు పర్యటనకు వెళ్లలేదు.. అలాగే శుభ్మన్ గిల్ గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు.

లాబుషేన్ మాట్లాడుతూ, 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో గాయాల కారణంగా భారత జట్టు పలు సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఆ సిరీస్‌ను చారిత్రక 2-1 తేడాతో గెలిచిన ఉదాహరణను గుర్తు చేశారు. గబ్బా కోటను ఛేదించడం భారత జట్టు చేసిన గొప్ప ఘనత అని పేర్కొన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు అర్హత పొందడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారత జట్టు ఫైనల్‌కు చేరుకోవాలంటే, ఇతర ఫలితాలపై ఆధారపడకుండా 4-0 తేడాతో ఈ సిరీస్ గెలవాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us