MS Dhoni: ఫిఫా చేరిన ధోనీ క్రేజ్.. బ్రెజిల్ vs సెర్బియా మ్యాచ్‌లో మార్మోగిన పేరు..

|

Nov 25, 2022 | 5:45 PM

ఫిఫా ప్రపంచ కప్ 2022లో బ్రెజిల్ జట్టు సెర్బియాపై తమ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సమయంలో ఎంఎస్ ధోని ఖతార్‌లో సందడి చేశాడు.

MS Dhoni: ఫిఫా చేరిన ధోనీ క్రేజ్.. బ్రెజిల్ vs సెర్బియా మ్యాచ్‌లో మార్మోగిన పేరు..
Chennai Super Kings DHoni
Follow us on

ఫిఫా ప్రపంచకప్‌ ఫీవర్‌ యావత్‌ ప్రపంచాన్ని ఊపేస్తోంది. నేమార్, లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో ​​రొనాల్డో, కైలిన్ ఎంబాప్పే, హ్యారీ కేన్ పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్నాయి. ఈ ఆటగాళ్లు స్టేడియంలోకి అడుగు పెట్టగానే వారి పేర్లతో స్టేడియం మారుమోగుతుంది. అయితే బ్రెజిల్ వర్సెస్ సెర్బియా మ్యాచ్ లో మాత్రం స్టేడియంలో భిన్నమైన దృశ్యం కనిపించింది. ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరు వినిపించింది.

చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఎంఎస్ ధోని జెర్సీ నంబర్ 7 మ్యాచ్ సమయంలో కనిపించింది. అతని జెర్సీ బ్రెజిల్‌కు మద్దతు ఇస్తున్న అభిమానుల చేతుల్లో కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో భారత జట్టు భాగం కానప్పటికీ, ఈ టోర్నీకి భారతీయ అభిమానులు కూడా భాగమయ్యారు. ఈ టోర్నమెంట్‌ని చూడటానికి చాలా మంది భారతీయులు ఖతార్ వెళ్లారు.

ఖతార్‌లో ధోనీ జెర్సీ సందడి..

ఇందులో ఎంఎస్ ధోనీ అభిమానులు ఉన్నారు. వారు బ్రెజిల్‌కు మద్దతుగా ధోనీ CSK జెర్సీతో స్టేడియంకు చేరుకున్నారు. అయితే, ఇందులో ఓ కామన్ పాంయిట్ కూడా ఉందండోయ్. బ్రెజిల్, CSK రెండింటి జెర్సీ రంగు పసుపు కావడమే.

ఆ అభిమాని స్టేడియం లోపలికి ధోనీ జెర్సీని తీసుకువెళ్లాడు. అక్కడ బ్రెజిల్ అభిమానుల చేతుల్లో ధోనీ జెర్సీ కూడా కనిపించింది. అలాగే బ్రెజిల్ అభిమానులు భారత అభిమాని నుంచి ధోని గురించి అడిగి మరీ తెలుసుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..