ఎస్పీ బాలు ఆరోగ్యంపై మరిన్ని వివరాలను అందించిన చరణ్

సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌ చేశారు. ఎక్మో/వెంటిలేటర్‌ సాయంతో చికిత్స కొనసాగుతోందని అన్నారు. వైద్యులు తన తండ్రికి ఫిజియో థెరపీ చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఆయన ఆహారంగా ద్రవ పదార్థాలు తీసుకుంటున్నారని, ఆస్పత్రి నుంచి సాధ్యమైనంత త్వరగా ఇంటికి వెళ్లాలన్న ఆసక్తితో ఉన్నారంటూ చరణ్‌ తన ట్విటర్ ఖాతా‌లో వెల్లడించారు. కోవిడ్ వైరస్‌ సోకడంతో ఆగస్టు 5న […]

ఎస్పీ బాలు ఆరోగ్యంపై మరిన్ని వివరాలను అందించిన చరణ్
Follow us

|

Updated on: Sep 22, 2020 | 11:40 PM

సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌ చేశారు. ఎక్మో/వెంటిలేటర్‌ సాయంతో చికిత్స కొనసాగుతోందని అన్నారు. వైద్యులు తన తండ్రికి ఫిజియో థెరపీ చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఆయన ఆహారంగా ద్రవ పదార్థాలు తీసుకుంటున్నారని, ఆస్పత్రి నుంచి సాధ్యమైనంత త్వరగా ఇంటికి వెళ్లాలన్న ఆసక్తితో ఉన్నారంటూ చరణ్‌ తన ట్విటర్ ఖాతా‌లో వెల్లడించారు.

కోవిడ్ వైరస్‌ సోకడంతో ఆగస్టు 5న బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యులు వెంటిలేటర్‌, ఎక్మో సాయంతో చికిత్స ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇటీవల ఆయనకు కరోనా నెగెటివ్‌ అని తేలడంతో అందరూ సంతోషం వ్యక్తంచేశారు. బాలు త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అంతా కోరుకుంటున్నారు.