‘ మీ టికెట్లకు సోనియా గాంధీ డబ్బులిచ్చారు’… కాంగ్రెస్ ఎమ్మెల్యే వినూత్న ప్రచారం

‘ మీ టికెట్లకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ డబ్బులిచ్చారంటూ”.. ఈ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు పంజాబ్ లో హల్చల్ చేశారు. పైగా మిమ్మల్ని ఆదుకునేవారెవరో మీకు తెలుసు అని కూడా వాళ్ళ భుజం తట్టారు. ఆ రాష్ట్రంలోని భటిండా రైల్వే స్టేషన్ లో జరిగిందీ వింత ఘటన.. ఆ స్టేషన్ నుంచి బీహార్ లోని ముజఫర్ పూర్ బయల్దేరుతున్న రైలు దగ్గరకు చేరుకున్నాడు అమరేందర్ రాజా వారింగ్ అనే ఈ ‘వినయ విధేయ […]

' మీ టికెట్లకు సోనియా గాంధీ డబ్బులిచ్చారు'... కాంగ్రెస్ ఎమ్మెల్యే వినూత్న ప్రచారం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 11, 2020 | 3:20 PM

‘ మీ టికెట్లకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ డబ్బులిచ్చారంటూ”.. ఈ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు పంజాబ్ లో హల్చల్ చేశారు. పైగా మిమ్మల్ని ఆదుకునేవారెవరో మీకు తెలుసు అని కూడా వాళ్ళ భుజం తట్టారు. ఆ రాష్ట్రంలోని భటిండా రైల్వే స్టేషన్ లో జరిగిందీ వింత ఘటన.. ఆ స్టేషన్ నుంచి బీహార్ లోని ముజఫర్ పూర్ బయల్దేరుతున్న రైలు దగ్గరకు చేరుకున్నాడు అమరేందర్ రాజా వారింగ్ అనే ఈ ‘వినయ విధేయ ఎమ్మెల్యే’.. ప్లాట్ ఫామ్ పై ఉన్న వలస కూలీలకు ఆయన పాంప్లెట్లు పంచి పెట్టడమే గాక.. రైలెక్కి కిటికీల నుంచి చూస్తున్నవారికి వీటిని ఇస్తూ.. మీ ప్రయాణానికి అయ్యే ఖర్చును సోనియా గాంధీయే భరిస్తున్నారని చెప్పారు. పైగా ఈ స్టేషన్ లో ఓ స్పీచ్ కూడా ఇచ్చాడు. ప్రతి వలస కార్మికుడికీ మేం సాయపడతాం అని సోనియా గతవారం ఇఛ్చిన హామీని ఆయన గుర్తు చేశాడు. ఆమె డబ్బులిచ్చారని, ఈ రాష్ట్ర సీఎం అమరేందర్ సింగ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ కూడా మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపేందుకు అన్ని సౌకర్యాలు కల్పించారని వారిని కూడా పనిలో పనిగా ఆకాశానికి ఎత్తేశాడు. ఈ పాంప్లెట్ లో అన్నీ రాసి ఉన్నాయి. మీ జర్నీలో చదువుకోండి అని ఉచిత సలహా పారేశాడు. ఒక రాజకీయ పార్టీ నేత  వలస కూలీల తరలింపును వెరైటీగా  పొలిటికల్ ప్రయోజనాల కోసం వాడుకోవడం, ఇలా పాంప్లెట్లు పంచి ప్రచారం చేయడం ఇదే మొదటిసారి.