పార్లమెంట్ తొలి సెషన్ కి హాజరు కాలేని సోనియా, రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా, ఆమె కుమారుడు రాహుల్ సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరు కాలేరు. మెడికల్ చెకప్ కోసం సోనియా విదేశాలకు బయల్దేరివెళ్లారు. సుమారు రెండువారాలపాటు..

పార్లమెంట్ తొలి సెషన్ కి హాజరు కాలేని సోనియా, రాహుల్ గాంధీ
Follow us

| Edited By: Balu

Updated on: Sep 13, 2020 | 10:15 AM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా, ఆమె కుమారుడు రాహుల్ సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరు కాలేరు. మెడికల్ చెకప్ కోసం సోనియా విదేశాలకు బయల్దేరివెళ్లారు. సుమారు రెండువారాలపాటు ఆమె అక్కడే ఉంటారని, ఆమె వెంట రాహుల్ కూడా వెళ్లారని పార్టీ ట్వీట్ చేసింది. రాహుల్ మాత్రం కొన్ని రోజుల్లోనే తిరిగి వచ్చి పార్లమెంటుకు హాజరవుతారు. చట్ట సభలో తమ పార్టీ లేవనెత్తాల్సిన అంశాలపై సోనియా తమ వారికి దిశానిర్దేశం చేశారు. వ్యూహాత్మకంగా ఆమె తను వెళ్లేముందే పార్టీని దాదాపు ‘ప్రక్షాళన’ చేసేశారు. గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున్ ఖర్గే, అంబికా సోనీ వంటి వారిని పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులనుంచి తొలగించారు. ముఖ్యంగా రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఉన్న గులాం నబీ ఆజాద్ ప్రాధాన్యతను తగ్గించేశారు.

రణదీప్ సింగ్ సూర్జేవాలా, పి.చిదంబరం, తారిఖ్ అన్వర్, జితేంద్ర సింగ్ తదితరులను పునర్వ్యవస్థీకరించిన వర్కింగ్ కమిటీలో రెగ్యులర్ సభ్యులుగా సోనియా నియమించారు. రాహుల్ విధేయుడు రణదీప్ సింగ్ ససుర్జేవాలాను ప్రధాన కార్యదర్శిని చేసి  కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్-ఛార్జిగా నియమించారు. ఇలా తన ఫారిన్ టూర్ కి ముందు సోనియా …. ‘ లేఖతో’ అసమ్మతివాదులుగా ముద్ర పడినవారిని దాదాపు పక్కనపెట్టి బయల్దేరారు.