బంగారం తగ్గింది.. ఎంతో తెలుసా…?

బంగారం ధర వరుసగా రెండో రోజు కూడా తగ్గింది. మరోవైపు వెండి స్వల్పంగా పెరిగింది. ఈ రెండు మెటల్స్ వ్యతిరేక దిశలో పయణిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.137 దిగొచ్చి.. రూ.51,245 కు చేరింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో నెలకొన్న ఒత్తిడి కారణంగా పసిడి ధరలు తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది. వెండి ధర కిలోకు రూ.475 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,648 వద్దకు లభిస్తోంది .అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర […]

బంగారం తగ్గింది.. ఎంతో తెలుసా...?
Follow us

|

Updated on: Oct 28, 2020 | 1:11 AM

బంగారం ధర వరుసగా రెండో రోజు కూడా తగ్గింది. మరోవైపు వెండి స్వల్పంగా పెరిగింది. ఈ రెండు మెటల్స్ వ్యతిరేక దిశలో పయణిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.137 దిగొచ్చి.. రూ.51,245 కు చేరింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో నెలకొన్న ఒత్తిడి కారణంగా పసిడి ధరలు తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది.

వెండి ధర కిలోకు రూ.475 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,648 వద్దకు లభిస్తోంది .అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,903.6 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 24.48 డాలర్ల వద్ద స్థిరపడిందిఅమెరికా డాలర్​తో పోల్చితే.. రూపాయి విలువ 13 పైసలు బలపడి రూ.73.71 వద్ద నిలిచింది.