శ్రేయాస్ అయ్యర్‌కు డబుల్ షాక్..!

అబుదాబీ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అసలే ఓటమితో షాక్‌లో ఉన్న ఆ జట్టుకు తాజాగా మరో షాక్ తగిలింది.

శ్రేయాస్ అయ్యర్‌కు డబుల్ షాక్..!
Follow us

|

Updated on: Sep 30, 2020 | 3:23 PM

Shreyas Iyer Fined For Slow Over-Rate: అబుదాబీ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అసలే ఓటమితో షాక్‌లో ఉన్న ఆ జట్టుకు తాజాగా మరో షాక్ తగిలింది. ఢిల్లీ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. స్లో-ఓవర్ రేట్ కారణంగా ఈ చర్యలు తీసుకున్నామని లీగ్ నిర్వాహకులు వెల్లడించారు.

పిచ్ నెమ్మదిగా ఉండటంతో పాటు సన్‌రైజర్స్ ప్రధాన బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలదొక్కుకోవడం వల్ల‌ ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వికెట్లు తీసేందుకు బౌలింగ్‌లో పలు మార్పులు చేశాడు. అంతేకాకుండా పదేపదే ఆటగాళ్లతో, బౌలర్లతో చర్చలు జరిపాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ నిర్దేశించిన సమయంలో తమ బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోయింది. దీనితో ఢిల్లీ కెప్టెన్‌కు భారీ జరిమానా విధించారు. అలాగే గతంలో ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ఇదే కారణంగా రూ. 12 లక్షల జరిమానా పడింది.

Also Read: IPL 2020: రాయల్స్ జోరుకు కోల్‌కతా కళ్లెం వేస్తుందా.!