రైతును మోసం చేసిన విత్తన సంస్థకు ఫైన్.. రూ.2.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశం

నష్టపోవడం రైతులకు, ముంచెయ్యడం కొన్ని విత్తన కంపెనీలకు అలవాటు అయ్యిపోయింది. అన్నదాతలు ఎన్నిసార్లు ఆవేదన వ్యక్తం చేసినా, ఆందోళనలు చేసినా ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.

రైతును మోసం చేసిన విత్తన సంస్థకు ఫైన్.. రూ.2.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశం
Follow us

|

Updated on: Nov 13, 2020 | 6:18 PM

నష్టపోవడం రైతులకు, ముంచెయ్యడం కొన్ని విత్తన కంపెనీలకు అలవాటు అయ్యిపోయింది. అన్నదాతలు ఎన్నిసార్లు ఆవేదన వ్యక్తం చేసినా, ఆందోళనలు చేసినా ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. కానీ తాజాగా అనంతపురం జిల్లా పామిడి మండలానికి చెందిన లక్ష్మీనారాయణరెడ్డి అనే రైతుకు వినియోగదారుల కమిషన్ న్యాయం చేసింది. వివరాల్లోకి వెళ్తే…మణికంఠ ఆగ్రో ఏజెన్సీస్‌లో రూ.6,880తో పత్తి విత్తనాలను కొని రెండున్నర ఎకరాల్లో సాగు చేశారు లక్ష్మీనారాయణరెడ్డి. పంట ఎంతకీ రాకపోవడంతో వ్యవసాయాధికారులకు సమాచారమిచ్చారు. విత్తనాలిచ్చిన షాపు ఓనర్ వద్దకు వెళ్లి నష్ట పరిహారం ఇప్పించాలని కోరారు.

ఆ తర్వాత ఆయనకు, ముంబయికి చెందిన విత్తన తయారీదారు, అనంతపురానికి చెందిన డిస్ట్రిబ్యూటరుకులీగల్‌ నోటీసులిచ్చారు. అయితే వారు అనంతపురం జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. తామిచ్చిన సూచనలను రైతు పాటించనందునే పంట నష్టం వాటిల్లిందని విత్తన తయారీ సంస్థ కౌంటరు వేసింది. 2017లో జిల్లా కమిషన్‌ ఇరు వర్గాల వాదనలను విని విత్తన సంస్థ తరఫున సేవాలోపం ఉందని గుర్తించింది. విత్తన సంస్థ, సరఫరాదారు, డీలరు కలిసి పంట నష్టానికిగానూ రైతుకు రూ.2.5 లక్షలు చెల్లించాలని తీర్పునిచ్చింది. తీర్పును  విత్తన సంస్థ సవాల్ చేస్తూ రాష్ట్ర కమిషన్‌ను ఆశ్రయించింది. జిల్లా కమిషన్‌ నిర్ణయాన్నే సమర్థిస్తూ రాష్ట్ర కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ టి.సునీల్‌ చౌదరి, మెంబర్ పి.ముత్యాల నాయుడు తీర్పునిచ్చారు.

అయితే అన్నీ ఆధారాలు ఉండబట్టి ఇన్నేళ్ల  తర్వాత న్యాయం జరిగింది. అవే లేకపోతే పరిస్థితి వేరే ఉండేది. అసలు తాము మోసపోయామని వినియోగదారులు కమిషన్ ఆశ్రయించే రైతులు ఎంతమంది ఉంటారు చెప్పండి. అందుకే నకిలీ విత్తన సంస్థలపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. అన్నదాతలను మోసం చెయ్యాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

Also Read :

ప్రాణాలు తీసిన కల్తీ మద్యం, ముగ్గురు దుర్మరణం, మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం

ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు బాగున్నాయి, చలి కాలంలో అప్రమత్తత అవసరం : కోటి కమాండ్ సెంటర్ డీహెచ్

తెలుగు ప్రజలకు సీఎంల దీపావళి శుభాకాంక్షలు, ప్రజల జీవితాల్లో పండుగ వెలుగులు నింపాలని ఆకాంక్ష

ఆ ఇద్దరు లెజెండ్‌లు కలిస్తే రోహిత్.. ముంబై సారథిపై ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం

ఓటీటీలోకి వచ్చేసిన ఓ మై గాడ్ 2 తెలుగు వెర్షన్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఓ మై గాడ్ 2 తెలుగు వెర్షన్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఏంటీ ఆ బ్యూటీ.. ఈవిడా ఒకటేనా.!! ఈ అమ్మడు ఎంతలా మారిపోయిందో
ఏంటీ ఆ బ్యూటీ.. ఈవిడా ఒకటేనా.!! ఈ అమ్మడు ఎంతలా మారిపోయిందో
మామిడి ఆకుల్ని ఇలా తీసుకున్నారంటే.. అద్భుతంగా పని చేస్తాయి..
మామిడి ఆకుల్ని ఇలా తీసుకున్నారంటే.. అద్భుతంగా పని చేస్తాయి..
స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్సుల్లో రోడ్డెక్కిన యువ జంట షికారు..!
స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్సుల్లో రోడ్డెక్కిన యువ జంట షికారు..!
ఫుడ్ ఆర్డర్‌ను ఆవురావురుమంటూ తెరిచింది.. కట్ చేస్తే.. షాక్.!
ఫుడ్ ఆర్డర్‌ను ఆవురావురుమంటూ తెరిచింది.. కట్ చేస్తే.. షాక్.!
మొదలైన పుష్ప నామస్మరణ.. పుష్ప ఆర్టిస్ట్ లా లీక్స్ వైరల్.!
మొదలైన పుష్ప నామస్మరణ.. పుష్ప ఆర్టిస్ట్ లా లీక్స్ వైరల్.!
కుజ, గురు గ్రహాల మధ్య పరివర్తన..ఆ రాశుల వారికి కొన్ని కష్టనష్టాలు
కుజ, గురు గ్రహాల మధ్య పరివర్తన..ఆ రాశుల వారికి కొన్ని కష్టనష్టాలు
కలబంద రసంలో ఆరోగ్య రహస్యం దాగుంది.. ఎందుకో తెలుసా?
కలబంద రసంలో ఆరోగ్య రహస్యం దాగుంది.. ఎందుకో తెలుసా?
మీటింగ్ అవాంతరాల నుంచి ఈజీగా ‘స్విచ్’ అయిపోండి.. సూపర్ ఫీచర్..
మీటింగ్ అవాంతరాల నుంచి ఈజీగా ‘స్విచ్’ అయిపోండి.. సూపర్ ఫీచర్..
వ్యాయామం, డైట్ ఫాలో అవ్వకుండా ఇలా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోండి..
వ్యాయామం, డైట్ ఫాలో అవ్వకుండా ఇలా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోండి..