నేటి నుంచి వారి ఖాతాల్లో రూ.10 వేల న‌గ‌దు

లాక్‌డౌన్‌, స‌ముద్రంలో చేప‌ల వేట నిషేధంతో ఉపాధి కోల్పోయిన మ‌త్స్య‌కారుల‌కు స‌ర్కారు చేయూత అందించ‌నుంది. మ‌త్స్య‌కార భ‌రోసా కింద నేటి నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వం వారికి రూ. 10 వేల సాయాన్ని అందించ‌నుంది. మొత్తం 1,09,231 మంది ల‌బ్ధిదారుల‌కు రూ. 10 వేల చొప్పున నేరుగా బ్యాంకు అకౌంట్ల‌లో న‌గ‌దు జ‌మ చేయ‌నుంది. ఇక ప‌థ‌కంలో వివ‌క్ష చూప‌వ‌ద్ద‌ని..త‌మ‌కు ఓటు వేయ‌ని వారికి కూడా సాయం చేయాల‌ని ఇప్ప‌టికే అధికారుల‌కు సూచించారు సీఎం జ‌గ‌న్‌. ఎన్నికల సమయంలో […]

నేటి నుంచి వారి ఖాతాల్లో రూ.10 వేల న‌గ‌దు
Follow us

|

Updated on: May 06, 2020 | 6:56 AM

లాక్‌డౌన్‌, స‌ముద్రంలో చేప‌ల వేట నిషేధంతో ఉపాధి కోల్పోయిన మ‌త్స్య‌కారుల‌కు స‌ర్కారు చేయూత అందించ‌నుంది. మ‌త్స్య‌కార భ‌రోసా కింద నేటి నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వం వారికి రూ. 10 వేల సాయాన్ని అందించ‌నుంది. మొత్తం 1,09,231 మంది ల‌బ్ధిదారుల‌కు రూ. 10 వేల చొప్పున నేరుగా బ్యాంకు అకౌంట్ల‌లో న‌గ‌దు జ‌మ చేయ‌నుంది. ఇక ప‌థ‌కంలో వివ‌క్ష చూప‌వ‌ద్ద‌ని..త‌మ‌కు ఓటు వేయ‌ని వారికి కూడా సాయం చేయాల‌ని ఇప్ప‌టికే అధికారుల‌కు సూచించారు సీఎం జ‌గ‌న్‌. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వేట విరామ సాయాన్ని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామ‌ని వైఎస్ జ‌గ‌న్ ఇచ్చిన మాట మేర‌కు మ‌త్స్య‌కారులకు ఇచ్చిన హామీని నిల‌బెట్టుకుంటున్నారు సీఎం జ‌గ‌న్‌. మునుపెన్నడూ లేని రీతిలో వేట నిషేధ సమయంలో సాయం అందుతుండటంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.