శర్వాను రిఫర్ చేసిన చెర్రీ..ఎంతైనా ఫ్రెండ్స్ గురూ..!
కిషోర్ తిరుమల దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నాడు శర్వా. అయితే తాజాగా ఈ మరో క్రేజీ ప్రాజెక్టుకు కూడా ఈ యంగ్ హీరో పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. అది ఓ కొత్త దర్శకుడితో యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కునున్నట్లు సమాచారం.
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్తో ఇంటికే పరిమితమైన సినీ సెలబ్రిటీలు ఫ్యామిలీలతో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. అంతేకాదు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెడుతున్నారు. ఈ విరామ సమయంలో చక్కగా కథలు వింటూ మంచి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. యంగ్ హీరో శర్వానంద్ కూడా ఇదే పనిలో ఉన్నాడు.
ఇప్పటికే శర్వా నుంచి ‘శ్రీకారం’ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉండగా.. అజయ్ భూపతితో చేయాల్సిన ‘మహా సముద్రం’ షూటింగులకు పర్మిషన్ ఇస్తే సెట్స్పైకి వెళ్లేందుకు రెడీగా ఉంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నాడు శర్వా. అయితే తాజాగా ఈ మరో క్రేజీ ప్రాజెక్టుకు కూడా ఈ యంగ్ హీరో పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. అది ఓ కొత్త దర్శకుడితో యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కునున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ కథ తొలుత రామ్చరణ్ దగ్గరికి వెళ్లగా..అతడు శర్వాను రిఫర్ చేశాడట. ఈ ఇద్దరు హీరోలు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. కాగా చరణ్, శర్వాల మిత్రుడైన శ్రీరామ్ రెడ్డి అనే వ్యక్తి ఈ కథను సిద్ధం చేసినట్లు సమాచారం.