పదవీకాలం ముగిసిన రాజ్యసభ సభ్యులు ఘనంగా వీడ్కోలు
పదవి కాలం పూర్తైన రాజ్యసభ సభ్యులకు పార్లమెంట్ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి 11 మంది రాజ్యసభ ఎంపీలకు పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో 11 మంది ఎంపీలకు రాజ్యసభ వీడ్కోలు పలికింది.
పదవి కాలం పూర్తైన రాజ్యసభ సభ్యులకు పార్లమెంట్ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి 11 మంది రాజ్యసభ ఎంపీలకు పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో 11 మంది ఎంపీలకు రాజ్యసభ వీడ్కోలు పలికింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటితో ముగుస్తున్నందున వారికి వీడ్కోలు పలికినట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తెలిపారు. పదవీ విరమణ పొందనున్న ఎంపీల్లో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. వీరిలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, సమాజ్వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకుడు వీర్ సింగ్, కాంగ్రెస్ నేత రాజ్ బాబర్తో పాటు సమాజ్ వాదీ పార్టీకి చెందిన జావేద్ అలీఖాన్, రవి ప్రకాశ్ వర్మ, చంద్రపాల్ సింగ్ యాదవ్, కాంగ్రెస్ నుంచి పీఎల్ పునియా, బహుజన సమాజ్ పార్టీకి చెందిన రాజారాం, బీజేపీకి చెందిన నీరజ్ శేఖర్, అరుణ్ సింగ్ ఉన్నారు. అయితే కేంద్ర మంత్రిగా ఉన్న హర్దీప్ సింగ్ రాజ్యసభ్య సభ్యుడిగా పదవి కాలం ముగుస్తుండడంతో ఆయనకు మరో అవకాశం ఇచ్చి మంత్రిగా కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.