అక్కడ గొడుగుల‌తో సామాజిక దూరం.. ఎక్కడంటే..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఈ వైర‌స్ కట్టడికోసం మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని ఒక గ్రామంలోని

అక్కడ గొడుగుల‌తో సామాజిక దూరం.. ఎక్కడంటే..
Follow us

| Edited By:

Updated on: Jun 02, 2020 | 12:29 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఈ వైర‌స్ కట్టడికోసం మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని ఒక గ్రామంలోని ప్రజలు సామాజిక దూరాన్ని పాటించేందుకు గొడుగులను ఉపయోగిస్తున్నారు. పూణే, నాసిక్ హైవేలోని మాంచర్ గ్రామ పంచాయతీ ప్ర‌జ‌లు గొడుగును సోష‌ల్ డిస్టెన్స్‌ సాధనంగా ఉపయోగిస్తున్నట్లు స్థానిక అధికారి తెలిపారు.

కాగా.. ఈ క‌ట్టుబాటు కార‌ణంగానే 50 వేల జనాభా ఉన్నఈ గ్రామంలో ఇప్పటికీ ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాలేదు. అయితే లాక్‌డౌన్‌ నిబంధనలను క్రమంగా సడలించడం కార‌ణంగా, ముంబై నుండి ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో వ‌స్తున్నార‌ని, వారివ‌ల‌న క‌రోనా వ్యాప్తి ప్రమాదం ఉంద‌ని గ్రామ సర్పంచ్ ఆందోళ వ్య‌క్తం చేశారు. కేర‌ళ‌లో మాదిరిగా గొడుగుల‌ను ఉప‌యోగించి, గ్రామంలోని వారంతా సా‌మాజిక దూరం పాటిస్తున్నార‌ని తెలిపారు.

Also Read: కరోనా ట్రెండీ కలెక్షన్.. డిజైనర్ మాస్కులు.. న్యూ ఫ్యాషన్..