
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్మీ భారత్లో 12 సిరీస్ను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్లో భాగంగా రెడ్మీ నోట్ 12, నోట్ 12 ప్రో, నోట్ 12 ప్రో+ మూడు ఫోన్లను తీసుకొస్తున్నారు.

న్యూ ఇయర్ గిఫ్ట్గా రెడ్మీ ఈ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. జనవరి 5వ తేదీన రెడ్మీ నోట్ 12 సిరీస్ను లాంచ్ చేయనుంది. రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్లో ఏకంగా 200 మెగాపిక్సెల్స్తో కూడిన కెమెరాను అందిస్తుండడం విశేషం.

రెడ్మీ నోట్ 12 ప్రో+ ఫోన్ ధర లీకైంది. ఈ సమాచారం ప్రకారం 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 24,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 26,999, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 28,999గా ఉంది.

ఇక ఈ సిరీస్లో వస్తోన్న ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ఎస్ఓసీ ప్రాసెసర్ను అందించారు. ప్రో+లో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఈ మూడు స్మార్ట్స్ ఫోన్స్లో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఒక్క 12 ప్రో+ మాత్రం 210 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ కేవలం 9 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జ్ పూర్తవుతుంది.