
సూర్యుడి మకర సంక్రమణం జరిగే సమయంలో ధనస్సు రాశిలోని బుధుడితో కలుస్తాడు. దీని వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. అయితే వంద సంవత్సరాల తర్వాత ఈ అద్భుతమైన కలయిక జరగడం వలన ఇది, 12 రాశులపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. కానీ 4 రాశుల వారికి మాత్రం ఊహించని లాభాలు ఉన్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

కుంభ రాశి : కుంభ రాశి వారికి 11వ ఇంటి లోపల బుధాదిత్య రాజయోగం ఏర్పడటం వలన వీరు కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయి. ఆర్థికంగా బాగుటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేసే ఛాన్స్ ఉంది. మీ దగ్గరి బంధువును కలవడం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉండబోతుంది. ఆత్మవిశ్వాసంతో పని చేస్తారు.

వృషభ రాశి : వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. వీరు దూర ప్రయాణాలు చేసే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు మంచి ఉద్యోగంలో జాయిన్ అవుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తారు. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. అప్పుల సమస్యలు తీరిపోయి చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

కన్యా రాశి : కన్యారాశి వారికి సూర్యుడు ఆశీస్సులు ఉండటం వలన వీరు అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు. అంతే కాకుండా వీరికి నాలుగో ఇంటిలోపల సూర్య, బుధుల కలయిక జరగడం వలన అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రాశి వారు కొత్త ఇల్లు కొనుగోలు చేయడం, కొత్త వాహనం కొనుగోలు చేయడం చేసే ఛాన్స్ ఉంది.

మేష : మేష రాశి వారికి ఇది చాలా అద్భుత సమయం అని చెప్పాలి. వీరికి 9వ ఇంటిలో రాజయోగం ఏర్పడుతుంది. అందువలన వీరు పెట్టుబడుల నుంచి అత్యధిక లాభాలు అందుకుంటారు. ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది చాలా మంచి సమయం. పొదుపు, పెట్టుబడులు కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది.