
రామమందిర ప్రారంభోత్సవంలో పెళ్లి చేసుకున్న నవ దంపతులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. దావణగెరె నగరంలోని బాపూజీ కళ్యాణ మండపంలో జరిగిన కళ్యాణోత్సవం, రామమందిర ప్రారంభోత్సవంతో మరింత కలకలలాడింది.

శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం రోజునే పెళ్లి చేసుకున్నందుకు దావణగెరెకు చెందిన రోహిత్, అర్పిత ఆనందం వ్యక్తం చేశారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా కళ్యాణ మండపంలో కూడా రాముడి ఫొటో పెట్టి పూజలు చేశారు.

నూతన దంపతులు రాముడి ఫోటోను పెట్టుకుని భక్తితో పూజించారు. అతిథులతో కలిసి జై శ్రీరామ అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. రామమందిర ప్రాణప్రతిష్ట రోజునే పెళ్లి ముహూర్తం పెట్టుకోవడం పట్ల కొత్త జంట ఆనందం వ్యక్తం చేసింది.

పెళ్లి వేదికపై ఏర్పాటు చేసిన రాముడు ఫోటో ముందు నిలబడి ..పెళ్లికి వచ్చిన అతిథులతో కలిసి ఫొటోలు దిగారు. అలాగే, రామమందిరం ప్రారంభం రోజున గర్భిణులు ప్రసవం కోసం వైద్యుల వద్దకు క్యూ కట్టారు.

మొత్తానికి అటు దేశవ్యాప్తంగా, రాష్ట్రంలోని దేవాలయాలు, ఇళ్లలో శ్రీరామ నామస్మరణ జరిగితే ఇక్కడ కళ్యాణమండపంలో కూడా శ్రీరామ నామస్మరణ జరగడం విశేషం.