భారత్లో.. 15 రోజుల్లో.. కొత్తగా లక్ష కరోనా పాజిటివ్ కేసులు..!
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల సంఖ్య రెండు లక్షలు దాటింది.
Coronavirus In India: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల సంఖ్య రెండు లక్షలు దాటింది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే బాధితుల సంఖ్య లక్ష నుండి రెండు లక్షలకు పెరగడం గమనార్హం. అయితే కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, ఈ వ్యాధి నుండి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుగుతుండటం విశేషం.
కాగా.. మే 19న ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం అప్పటికి దేశంలో కరోనా రోగుల సంఖ్య ఒక 1,01,139. వీరిలో 3163 మంది మృతి చెందారు. 15 రోజుల తరువాత ఇప్పుడు దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,07,615. దేశంలో కరోనా కేసులు 15 రోజుల్లో రెట్టింపయ్యాయి. ఈ రోజు ఉదయం ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇప్పటివరకు 5,815 మంది మృతి చెందారు. సుమారు 50 శాతం మంది అంటే 1,00,303 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇది ఉపశమనం కలిగించే అంశంగా మారింది.
Also R3ad: కరోనా పేషెంట్లకు ‘రెమిడీసివిర్’.. అత్యవసర పరిస్థితుల్లో 5 డోసులు ఇవ్వొచ్చు..