మీకు కోవిడ్ టెస్టులు అవసరమా ? లేదా ? సీబీఐకి ముంబై అధికారుల లేఖ
సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు కొత్త సమస్య వచ్చి పడింది. మీరు కరోనా వైరస్ టెస్టులు జరిపించుకుంటారా లేక వద్దనుకుంటున్నారా అంటూ రాసిన ఈ లేఖతో..
సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు కొత్త సమస్య వచ్చి పడింది. మీరు కరోనా వైరస్ టెస్టులు జరిపించుకుంటారా లేక వద్దనుకుంటున్నారా అంటూ రాసిన ఈ లేఖతో వారు అయోమయంలో పడ్డారు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యంగా బాంద్రా డీసీపీ అభిషేక్ త్రిముఖి తన కుటుంబ సభ్యులతో సహా కరోనావైరస్ బారిన పడడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇందుకు కారణం ఆయనతో వీరు కాంటాక్ట్ లోకి రావడమే.. సుశాంత్ కేసుకు సంబంధించి అభిషేక్ త్రిముఖి సీబీఐ అధికారులతో చాలాసార్లు సమావేశమయ్యారు. ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను వారికి అందజేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన వీరితో మొట్టమొదట ఆయనే భేటీ కావడం విశేషం.
ఇప్పుడు సుశాంత్ కేసు కన్నా మొదట సీబీఐ సిబ్బందికి ఈ అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే క్వారంటైన్ నుంచి మినహాయింపు కోరే సౌలభ్యం వీరికి ఉంది.