PM Modi: మాతృ దినోత్సవం రోజున.. మోదీకి సర్ప్రైజ్ గిఫ్ట్, ప్రధాని రియాక్షన్ ఇదే..
ఇక ఈ సృష్టిలో గొప్ప బంధాల్లో తల్లీబిడ్డల బంధం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బంధానికి సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా ఉండదు. మాతృ మూర్తిని ఎంతగానో ఆరాధించే వారిలో మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒకరు. తన మాతృమూర్తి హీరాబెన్తో ఉన్న బంధం ఎలాంటిదో దేశ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు...
![PM Modi: మాతృ దినోత్సవం రోజున.. మోదీకి సర్ప్రైజ్ గిఫ్ట్, ప్రధాని రియాక్షన్ ఇదే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/05/pm-modi-18.jpg?w=1280)
నేడు ప్రపంచవ్యాప్తంగా మాతృ దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తమ జీవితాల్లో వెలుగులు నింపి, తమ జీవితానికి ఓ అర్థం చెప్పిన అమ్మలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక వాట్సాప్లో సోషల్ మీడియాలో మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరికొందరైతే తమ మదర్స్కి బహుమతులు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తున్నారు.
ఇక ఈ సృష్టిలో గొప్ప బంధాల్లో తల్లీబిడ్డల బంధం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బంధానికి సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా ఉండదు. మాతృ మూర్తిని ఎంతగానో ఆరాధించే వారిలో మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒకరు. తన మాతృమూర్తి హీరాబెన్తో ఉన్న బంధం ఎలాంటిదో దేశ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరాబెన్ జీవించి ఉన్న సమయంలో.. ప్రధాని ఎంత బిజీగా ఉన్న కచ్చితంగా తన మాతృ మూర్తిని కలుస్తుండే వారు.
ముఖ్యంగా పుట్టిన రోజు వంటి కీలక సందర్భంగాల్లో కచ్చితంగా హీరాబెన్ ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకునేవారు. ఇంతలా తన తల్లితో బంధం ఉండేది మోదీకి. ఇక ఇటీవల లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో చోటుచేసుకున్న ఓ సంఘటన మోదీకి తన తల్లిపై ఉన్న ప్రేమకు నిదర్శనంగా నిలిచింది. తాజాగా మాతృదినోత్సవ వేళ సదరు వీడియో నెట్టింట మరోసారి వైరల్ అవుతోంది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీకి ఊహించని బహుమానం అందింది. మాతృ దినోత్సవం రోజున మోదీ మాతృమూర్తి దివంగత హీరాబెన్ చిత్రాన్ని ఆ పార్టీ అభిమానులు ఆయనకు అందించారు. సభకు హాజరైన ఇద్దరు యువకులు తీసుకొచ్చిన చిత్రాన్ని చూసి మోదీ ఉద్వేగానికి లోనయ్యారు.
సభలో ప్రధాని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతోన్న వేళ.. ఓ యువకుడి చేతిలో ఫొటోఫ్రేమ్ కన్పించింది. తన మాతృమూర్తి హీరాబెన్ తనను ఆశీర్వదిస్తున్న ఫొటో అది. పెన్సిల్తో గీసిన ఆ చిత్రాన్ని చూసిన మోదీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లిని గుర్తుచేసుకుని మాటలు రాక ప్రసంగాన్ని కొంతసేపు ఆపారు. ఆ తర్వాత చిత్రం తీసుకొచ్చిన యువకుడిని అభినందించారు. ఆ ఫొటో వెనక అతని పేరు, చిరునామా రాసివ్వాలని అతడికి సూచించారు. తాను లేఖ రాస్తానని మోదీ చెప్పారు. అప్పట్లో ఇది వైరల్గా మారిన విషయం విధితమే. ఇదిలా ఉంటే నరేంద్ర మోదీ గారి మాతృమూర్తి హీరాబెన్ 100 ఏళ్ల వయసులో 2022 డిసెంబరు 30న కన్నుమూసిన సంగతి తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..