కరోనా పరిస్థితిపై మళ్ళీ ఆరు రాష్ట్రాల సీఎంలతో మోదీ సమీక్ష

కరోనా వైరస్ పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల 23 న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించానున్నారు.ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, కర్ణాటక, యూపీ రాష్ట్రాల సీఎంలను అడిగి దీనిపై సమీక్షించనున్నారు.

కరోనా పరిస్థితిపై మళ్ళీ ఆరు రాష్ట్రాల సీఎంలతో మోదీ సమీక్ష
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 20, 2020 | 10:07 AM

కరోనా వైరస్ పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల 23 న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించానున్నారు.ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, కర్ణాటక, యూపీ రాష్ట్రాల సీఎంలను అడిగి దీనిపై సమీక్షించనున్నారు. ఇండియాలో గత 24 గంటల్లో 93,337 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కేసుల సంఖ్య 53 లక్షలకు పెరిగింది. నిన్న ఒక్కరోజే 1247 మంది కరోనా రోగులు మృతి చెందారు. ఫలితంగా ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 85,619 కి పెరిగింది. ఇదే సమయంలో 95,880 మంది రోగులు కోలుకున్నారు. రికవరీ రేటు 79.28 శాతం ఉంది.