అమితాబచ్చన్ సిబ్బందికి కరోనా టెస్టులు…26మందికి ?

|

Jul 13, 2020 | 5:15 PM

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ కుటుంబంలో కరోనా కలకలం రేపుతోంది. బచ్చన్ ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వ‌ర్య‌రాయ్, ఆరాధ్య క‌రోనా బారిన ప‌డడంతో బాలీవుడ్ ఉలిక్కి ప‌డింది. బ‌చ్చ‌న్ ఫ్యామిలీలో న‌లుగురికి క‌రోనా సోకిన నేప‌థ్యంలో బిగ్ బీకి సంబంధించిన నాలుగు బంగ్లాలు

అమితాబచ్చన్ సిబ్బందికి కరోనా టెస్టులు...26మందికి ?
Follow us on

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ కుటుంబంలో కరోనా కలకలం రేపుతోంది. బచ్చన్ ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వ‌ర్య‌రాయ్, ఆరాధ్య క‌రోనా బారిన ప‌డడంతో బాలీవుడ్ ఉలిక్కి ప‌డింది . అమితాబ్, అభిషేక్ నానావ‌తి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా, ఐష్‌, ఆరాధ్యల‌కి ఇంట్లోనే చికిత్సనందిస్తున్నారు. బ‌చ్చ‌న్ ఫ్యామిలీలో న‌లుగురికి క‌రోనా సోకిన నేప‌థ్యంలో బిగ్ బీకి సంబంధించిన నాలుగు బంగ్లాలు జ‌ల్సా, జ‌న‌క్‌, ప్ర‌తీక్ష‌, వ‌స్తాల‌ని సీల్ చేసిన అధికారులు అక్కడ పూర్తిగా శానిటైజ్ చేశారు. అంతేకాకుండా అమితాబ్‌కి సంబంధించిన సిబ్బంది, దగ్గరి కాంటాక్ట్‌లను గుర్తించి కోవిడ్ టెస్టులు నిర్వహించారు.

అమితాబ్ సిబ్బందిలో మొత్తం 26 మందికి కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. సిబ్బందికి జ‌రిపిన ప‌రీక్ష‌ల‌లో అంద‌రికి నెగెటివ్ వ‌చ్చింద‌నట్లు సమాచారం. అమితాబ్ భార్య జ‌యా బ‌చ్చ‌న్‌కి కూడా క‌రోనా ప‌రీక్ష‌ల‌లో నెగెటివ్ అని తేలింది. అయితే నానావ‌తి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న అమితాబ్, అభిషేక్‌ల ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు తెలిపారు. ట్రీట్మెంట్‌కి స‌హ‌క‌రిస్తుండ‌గా, వారికి సాధార‌ణ వైద్యం అందిస్తున్నామ‌ని చెప్పారు. మ‌రి కొద్ది రోజుల‌లోనే వారు కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటారని ..ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ కానున్నట్లు వైద్యులు తెలిపారు.