PM Modi: ఆడబిడ్డలపై అఘాయిత్యాలను సహించలేనిది.. భయపడే విధంగా కఠిన శిక్షలు అవసరంః మోదీ

|

Aug 15, 2024 | 11:41 AM

దేశంలో మహిళా ఆధారిత అభివృద్ధి నమూనాలో పని చేశామని ప్రధాని మోదీ అన్నారు. ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌తో సహా ప్రతి రంగంలో మహిళలు పురోగతి సాధిస్తున్నారు. మహిళలు భాగస్వామ్యాన్ని పెంచడమే కాకుండా నాయకత్వం వహిస్తున్నారు.

PM Modi: ఆడబిడ్డలపై అఘాయిత్యాలను సహించలేనిది.. భయపడే విధంగా కఠిన శిక్షలు అవసరంః మోదీ
Pm Modi On Women
Follow us on

దేశంలో మహిళా ఆధారిత అభివృద్ధి నమూనాలో పని చేశామని ప్రధాని మోదీ అన్నారు. ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌తో సహా ప్రతి రంగంలో మహిళలు పురోగతి సాధిస్తున్నారు. మహిళలు భాగస్వామ్యాన్ని పెంచడమే కాకుండా నాయకత్వం వహిస్తున్నారు. మన సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, అంతరిక్ష రంగంలో మహిళల బలం కనిపిస్తుంది. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. దేశం స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు.

దేశంలో ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. సమాజంలో మన తల్లులకు, చెల్లెళ్లకు, ఆడబిడ్డలకు జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఆలోచించాలన్నారు. ఇలాంటి దుర్మార్గాల పట్ల మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి. మహిళలపై జరుగుతున్న నేరాలపై త్వరితగతిన విచారణ జరిపి, క్రూరమైన చర్యలకు పాల్పడే వారిని వీలైనంత త్వరగా కఠినంగా శిక్షించాలన్నారు మోదీ. సమాజంలో విశ్వాసం పెరగాలంటే ఇది అవసరం. మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు వాటిపై చాలా చర్చ జరుగుతుంది. కానీ ఇలా చేసే రాక్షసుడికి శిక్ష పడినప్పుడు, బాధితులకు తగిన న్యాయం జరుగుతుంది. ఇటువంటి నేరాలకు పాల్పడే దోషులను ఉరి తీయాల్సి వస్తుందేమోనని భయపడే విధంగా శిక్షలు ఉండాలి. ఇలాంటి నేరాలకు పాల్పడే వారి గురించి విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భయాన్ని సృష్టించడం చాలా ముఖ్యం అని భావిస్తున్నానని మోదీ అన్నారు.

ఇక, తన హయాంలో చట్టంలో చేసిన మార్పులను కూడా ప్రధాని ప్రస్తావించారు. శతాబ్దాలుగా మనకున్న క్రిమినల్ చట్టాలను జ్యుడీషియల్ కోడ్ రూపంలో తీసుకొచ్చామని చెప్పారు. దాని ప్రధానాంశంగా, ‘శిక్ష కాదు, పౌరుడికి న్యాయం’ అనే సెంటిమెంట్‌ను మేము బలపరిచామన్నారు. న్యాయ్ మిషన్‌ విధానంలో జీవన సౌలభ్యం కోసం చర్యలు తీసుకోవాలని ప్రతి స్థాయి ప్రభుత్వ ప్రతినిధులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నానని మోదీ తెలిపారు.