HDFC Bank Loot: పట్టపగలు ప్రైవేటు బ్యాంకులో రూ.1.19 కోట్ల దోపిడీ… క్షణాల్లో దుండగుల పరారీ

బీహార్ లోని హాజీపూర్ జిల్లా జదుహా లోని హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు శాఖ నుంచి గురువారం ఉదయం దుండగులు రూ. 1.19 కోట్లను దోచుకుపోయారు. పట్టపగలు ఇంత దోపిడీ జరగడం స్థానికులను, పోలీసులను సైతం ఆశ్చర్యపరిచింది. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి..

HDFC Bank Loot: పట్టపగలు ప్రైవేటు బ్యాంకులో రూ.1.19 కోట్ల దోపిడీ... క్షణాల్లో దుండగుల పరారీ
Armed Men Loot Rs. 1.19 Crore In Bihar
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 10, 2021 | 5:55 PM

బీహార్ లోని హాజీపూర్ జిల్లా జదుహా లోని హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు శాఖ నుంచి గురువారం ఉదయం దుండగులు రూ. 1.19 కోట్లను దోచుకుపోయారు. పట్టపగలు ఇంత దోపిడీ జరగడం స్థానికులను, పోలీసులను సైతం ఆశ్చర్యపరిచింది. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఇంటికి సమీపంలోనే ఈ బ్యాంకు ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్యోగులు బ్యాంకును తెరచిన వెంటనే ఐదుగురు దుండగులు చొరబడి ముఖ్యంగా క్యాషియర్ రూమ్ నుంచి డబ్బు తేవాలని బెదిరించారట… సాయుధులై వచ్చిన వీరు మొత్తం రూ.1.19 కోట్లను సంచుల్లో కుక్కుకుని పరారయ్యారని పోలీసులు తెలిపారు.సీసీటీవీలో ఫుటేజీని చూసి దాని ఆధారంగా వారిని పట్టుకుని అరెస్టు చేస్తామని ఖాకీలు అంటున్నారు. ఈ దోపిడీలో బ్యాంకు సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు మొదలు పెట్టారు.

ముందు జాగ్రత్తగా జిల్లా సరిహద్దును మూసివేశారు. పక్కా ప్లాన్ తోనే దొంగలు ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. గతవారం ముజఫర్ నగర్ లో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఓ బ్యాంకు నుంచి 65 వేల రూపాయలను దోచుకుపోయారు. క్యాషియర్ కి గన్ చూపి బెదిరించి వారు ఈ దోపిడీకి దిగారు.

వారికీ నేటి ఈ ముఠా దుండగులకు మధ్య లింక్ ఉందా అన్న విషయాన్నీ పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: YS Jagan Delhi Tour Live Video : హస్తినకు సీఎం జగన్.. కొవిడ్‌ నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం.

Warangal : వరంగల్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం..రాత్రికి రాత్రే యువకుడు అదృశ్యం..వణికిపోతున్న స్థానికులు(వీడియో).

Corona 3rd wave : తెలుగు రాష్ట్రాలుపై థర్డ్ వెవ్ కలవరం..అప్రమత్తం అయిన ప్రభుత్వాల సంచలన నిర్ణయాలు.

ఎటు వెళ్తోందీ సమాజం..?తల్లి అక్రమ సంబంధానికి బలైన మరో బాలుడు..!మూడేళ్లకే నూరేళ్లు నిండిన చిన్నారి వీడియో :Crime video.