సీమ ఎత్తిపోతలపై తెలంగాణ వాదన వినేందుకు ఎన్​జీటీ సమ్మ‌తి

రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ వాదనలు వినేందుకు ఎన్‌జీటీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. కేసు రీ-ఓపెన్ చేయాలన్న దరఖాస్తును ఎన్​జీటీ చెన్నై ధర్మాసనం స‌మ్మ‌తించింది.

సీమ ఎత్తిపోతలపై తెలంగాణ వాదన వినేందుకు ఎన్​జీటీ సమ్మ‌తి
Follow us

|

Updated on: Aug 21, 2020 | 3:42 PM

రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ వాదనలు వినేందుకు ఎన్‌జీటీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. కేసు రీ-ఓపెన్ చేయాలన్న దరఖాస్తును ఎన్​జీటీ చెన్నై ధర్మాసనం స‌మ్మ‌తించింది. ఇప్పటికే తెలంగాణ వాసి శ్రీనివాస్ వేసిన పిటిషన్​పై తీర్పు రిజర్వ్ చేసింది.

తెలంగాణ స‌ర్కార్ తాజా దరఖాస్తుతో తీర్పు వాయిదా వేసింది. అభ్యంతరాలు చెప్పేందుకు సమయం సరిపోలేదని తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్ దరఖాస్తులో విన్న‌వించింది. తమ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని గతంలో అఫిడవిట్ వేసింది. దీనిపై తదుపరి విచారణ జస్టిస్ రామకృష్ణనన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈనెల 28కి వాయిదా వేసింది.

Also Read :

ఓ ఇంటివాడు కాబోతున్న టీమిండియా క్రికెట‌ర్ విజయ్ శంకర్

మ‌రోసారి ‘సూప‌ర్’ కాంబో !