చినజీయర్ స్వామికి వైవీ సుబ్బారెడ్డి, జూపల్లి రామేశ్వర్ రావు పరామర్శ

మాతృవియోగం పొందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామికి ప్రముఖుల నుంచి పరామర్శలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేసి స్వామిని పరామర్శించగా....

చినజీయర్ స్వామికి వైవీ సుబ్బారెడ్డి, జూపల్లి రామేశ్వర్ రావు పరామర్శ
Follow us

|

Updated on: Sep 13, 2020 | 9:33 PM

మాతృవియోగం పొందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామికి ప్రముఖుల నుంచి పరామర్శలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేసి స్వామిని పరామర్శించగా.. ఏపీ సీఎం జగన్ సైతం చినజీయర్ స్వామికి ఫోన్ చేసి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. తాజాగా టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు కూడా చినజీయర్ స్వామిని పరామర్శించారు. చిన్న జీయర్ స్వామిని పరామర్శించేందుకు ఆదివారం శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ శ్రీరామ్ నగర్ చేరుకున్న వీరిరువురూ స్వామీజీకి తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామిని పరామర్శించిన వై వి సుబ్బారెడ్డి, జూపల్లి రామేశ్వర్ రావు స్వామివారి మంగళ శాసనాలను అందుకున్నారు. అనంతరం జూపల్లి రామేశ్వర్ రావు ఆశ్రమంలోని వేద పాఠశాలలోని చిన్నారుల భాగోగులు అడిగి తెలుసుకున్నారు. వేద పాఠశాల విద్యార్థులతో కాసేపు గడిపారు. ఆపై వై.వి సుబ్బారెడ్డి తో కలిసి నగరానికి బయలుదేరి వెళ్లారు. కాగా, మాతృమూర్తి మంగతాయారు(80) హైదరాబాదులోని కుమార్తె నివాసంలో ఉండగా శరీరంలో షుగర్ లెవెల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. శనివారం మధ్యాహ్నం శంషాబాద్ మండలం శ్రీరామ్ నగర్ ఆశ్రమంలో ఆమె అంత్యక్రియలు జరిగాయి.