మై హోమ్ సీఎస్‌ఆర్ ఫండ్.. ఐదు గ్రామాలకు ఆర్థిక సాయం..

గ్రామాల అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు మై హోం మైన్స్ ఎండీ శ్రీనివాసరావు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో ఉన్న మై హోం ఇండస్ట్రీస్ మొదటి విడతగా సీఎస్‌ఆర్ ఫండ్ ఐదు గ్రామాలకు

మై హోమ్ సీఎస్‌ఆర్ ఫండ్.. ఐదు గ్రామాలకు ఆర్థిక సాయం..
Follow us

| Edited By:

Updated on: Jun 24, 2020 | 7:57 PM

గ్రామాల అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు మై హోం మైన్స్ ఎండీ శ్రీనివాసరావు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో ఉన్న మై హోం ఇండస్ట్రీస్ మొదటి విడతగా సీఎస్‌ఆర్ ఫండ్ ఐదు గ్రామాలకు అందించారు. మై హోం ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వర రావు సూచనల మేరకు 50 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామన్నారు శ్రీనివాసరావు. ఇటీవల లాక్ డౌన్ సమయంలో గ్రామాల్లోని ప్రజల నిత్యావసరాల కోసం ఆర్థికసాయాన్ని అందించామన్నారు. ఈ కార్యక్రమానికి మై హోమ్ ఫ్యాక్టరీ డిజిఎం పార్థసారథి, ఇతర ఉద్యోగులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆర్థిక సాయం పట్ల గ్రామపెద్దలు ధన్యవాదాలు తెలిపారు.

తమ గ్రామాలకు ఆర్థిక సాయాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు గ్రామపెద్దలు. ఎప్పుడు ఏ సాయాన్ని అడిగినా.. మైహోమ్ సంస్థ యాజమాన్యం వెంటనే స్పందిస్తూ ఆదుకుంటోందన్నారు. మైహోమ్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావుకి కృతజ్ఞతలు తెలిపారు.