కరోనా వ్యాక్సిన్: మోడెర్నా 3వ దశ క్లినికల్ ట్రయల్స్ షురూ..
కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ తయారీ కోసం అమెరికా కంపెనీ మోడెర్నా నేటి నుంచి మూడవ దశ ట్రయల్స్ నిర్వహించనున్నది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ఆ కంపెనీపై
కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ తయారీ కోసం అమెరికా కంపెనీ మోడెర్నా నేటి నుంచి మూడవ దశ ట్రయల్స్ నిర్వహించనున్నది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ఆ కంపెనీపై పెట్టుబడిని రెట్టింపు చేసింది. గతంలో 483 మిలియన్ల డాలర్లు ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా వ్యాక్సిన్ తయారీ సంస్థకు అదనంగా 472 మిలియన్ల డాలర్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పింది. మోడెర్నా బయోటెక్నాలజీ కంపెనీ ఈ విషయాన్ని ఆదివారం ఓ ప్రకటనలో తెలియజేసింది. సుమారు 30వేల రోగులపై మోడెర్నా మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయి.
యూఎస్ కు చెందిన బయెమెడికల్ అడ్వాన్స్డ్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ.. మోడెర్నా కంపెనీకి అదనపు నిధులను అందజేయనున్నది. ఆ నిధులను ఫేజ్ త్రీ కరోనా వైరస్ టీకా పరీక్షలకు వినియోగిస్తారు. తొలి దశలో భాగంగా ఏప్రిల్లోనే ఆ సంస్థకు 483 మిలియన్ల డాలర్లు అందాయి. తొలి దశ డేటా ఆధారంగా.. మేం రూపొందిస్తున్న mRNA వ్యాక్సిన్ కోవిడ్ మహమ్మారిని నియంత్రించగలదని మోడెర్నా సీఈవో స్టీఫేన్ బాన్సెల్ తెలిపారు. సింథటిక్ mRNA ద్వారా కరోనాకు వ్యతిరేకంగా ఇమ్మ్యూనిటీని డెవలప్ చేసే మందును మోడెర్నా తయారు చేస్తున్నది.
Read More:
గుడ్ న్యూస్: సప్లిమెంటరీ, బ్యాక్లాగ్ విద్యార్థులకు పాస్ మార్కులు..
గుడ్ న్యూస్: ఇక కామర్స్, ఆర్ట్స్ విద్యార్థులకూ ‘గేట్’ రాసే అవకాశం..!