హైదరాబాద్‌లో బాలికపై అత్యాచారం… హత్య!

హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో దారుణం జరిగింది. ఐస్‌క్రీమ్‌లో మత్తుమందు కలిపి 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేశారు. బాలికపై సవతితల్లి అన్న మల్లేష్‌ అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. అయితే బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటికి రాకుండా.. రూ.లక్షా 50 వేలు ఇచ్చేందుకు మల్లేష్‌ ఒప్పందం చేసుకున్నాడు. కానీ విషయం బయటకు రావడంతో బాలికను కొట్టి హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బాలిక తరపు బంధువులు ఆరోపణ చేస్తూ పోలీసులకు […]

హైదరాబాద్‌లో బాలికపై అత్యాచారం... హత్య!
Follow us

| Edited By:

Updated on: May 08, 2019 | 2:47 PM

హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో దారుణం జరిగింది. ఐస్‌క్రీమ్‌లో మత్తుమందు కలిపి 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేశారు. బాలికపై సవతితల్లి అన్న మల్లేష్‌ అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. అయితే బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటికి రాకుండా.. రూ.లక్షా 50 వేలు ఇచ్చేందుకు మల్లేష్‌ ఒప్పందం చేసుకున్నాడు. కానీ విషయం బయటకు రావడంతో బాలికను కొట్టి హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బాలిక తరపు బంధువులు ఆరోపణ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు మల్లేష్ పరారీలో ఉన్నాడు.