మంత్రి ధర్మాన ఇంట్లో కరోనా కలకలం.. ముగ్గురికి పాజిటివ్‌

ఏపీ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్‌ కుటుంబంలో కరోనా కలకలం రేపింది. ఆయన కుమారుడు, ఇద్దరు గన్‌మెన్‌లకు ట్రూ నాట్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో మంత్రి కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లో ఉండగా.. గన్‌ మెన్‌లను క్వారంటైన్‌కి తరలించారు. అయితే తుది నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. కాగా ఇటీవల వైఎస్‌ జయంతి వేడుకల్లో మంత్రి ధర్మాన పాల్గొన్నారు. దీంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న  వైసీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. ఇదిలా ఉంటే మరోవైపు పాలకొండ శాసనసభ్యురాలు విశ్వాసరాయి […]

మంత్రి ధర్మాన ఇంట్లో కరోనా కలకలం.. ముగ్గురికి పాజిటివ్‌
Follow us

| Edited By:

Updated on: Jul 10, 2020 | 2:15 PM

ఏపీ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్‌ కుటుంబంలో కరోనా కలకలం రేపింది. ఆయన కుమారుడు, ఇద్దరు గన్‌మెన్‌లకు ట్రూ నాట్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో మంత్రి కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లో ఉండగా.. గన్‌ మెన్‌లను క్వారంటైన్‌కి తరలించారు. అయితే తుది నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.

కాగా ఇటీవల వైఎస్‌ జయంతి వేడుకల్లో మంత్రి ధర్మాన పాల్గొన్నారు. దీంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న  వైసీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. ఇదిలా ఉంటే మరోవైపు పాలకొండ శాసనసభ్యురాలు విశ్వాసరాయి కళావతికు పాజిటివ్‌తో పాటు కరోనా లక్షణాలు ఉండటంతో కార్యాలయం మూసేశారు. శ్రీకాకుళం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డ్రైవర్‌కి సైతం కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. గడిచిన 24 గంటల్లో 1608 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు వెల్లడించారు.

Latest Articles