వీడియో తీయమని చెప్పి.. కృష్ణానదిలో దూకి ఆత్మహత్య
విజయవాడ కనకదుర్గ బ్రిడ్జి వద్ద విషాదం చోటుచేసుకుంది. తమ్ముడి కొడుకుని ఫోన్ లో రికార్డు చేయమని చెప్పి కృష్ణానదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
విజయవాడ కనకదుర్గ బ్రిడ్జి వద్ద విషాదం చోటుచేసుకుంది. తమ్ముడి కొడుకుని ఫోన్ లో రికార్డు చేయమని చెప్పి కృష్ణానదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పూజ చేసుకుంటానని వచ్చి బ్రిడ్జి పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడలో తాడిగడపకి చెందిన మన్నేదుర్గాప్రసాద్ గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కనకదుర్గ వారధి వద్ద పూజ చేసుకుంటానని వెళ్లాడు. తనతో పాటు తమ్ముడి కొడుకు సుజిత్ని వెంట తీసుకుని వెళ్లాడు. అయితే, పూజ జరుగుతున్నంత సేపు వీడియో రికార్డ్ చేయమన్నాడు. దీంతో సుజిత్ ఫోన్లో రికార్డు చేస్తుండగా ఇక్కసారిగా దుర్గాప్రసాద్ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యంతో చనిపోతున్నానని దుర్గాప్రసాద్ రాసిన సూసైడ్ నోట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, కళ్ళ ముందే పెద్దనాన్న చనిపోవతంతో సుజిత్ షాక్కి గురయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గల్లంతైన దుర్గాప్రసాద్ కోసం గాలిస్తున్నారు.
A man named durga PRASAD committed suicide after performing pooja at Kanakadurga Bridge Of Vijayawada
He jumped into krishna river
Prima facie Because Of ill health he committed suicide
Police search On pic.twitter.com/FbIbduXSla
— Lokesh journo (@Lokeshpaila) September 22, 2020