దారుణ ఘటన.. సాధువులపై మూకదాడి.. ముగ్గురు మృతి..!
ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారితో వణికిపోతుంటే.. మహారాష్ట్రలోని పాల్ఘర్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఈ నెల 16వ తేదీన లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో.. రాత్రి సమయంలో ఓ వాహనం ఇద్దరు సాధువలు.. డ్రైవర్ అటుగా వెళ్తుండగా.. వాహనంపై దాదాపు వెయ్యి మందికి పైగా దాడికి దిగారు. వాహనంలో ఉన్న ఇద్దరు సాధువులను, డ్రైవర్ను బయటకు లాగి.. కర్రలు, రాడ్లు, రాళ్లతో కొట్టి చంపేశారు. అయితే సాధువులు వారి గురువు పరమపదించడంతో.. అంతిమ సంస్కారాలకు హాజరయ్యేందుకు […]
ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారితో వణికిపోతుంటే.. మహారాష్ట్రలోని పాల్ఘర్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఈ నెల 16వ తేదీన లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో.. రాత్రి సమయంలో ఓ వాహనం ఇద్దరు సాధువలు.. డ్రైవర్ అటుగా వెళ్తుండగా.. వాహనంపై దాదాపు వెయ్యి మందికి పైగా దాడికి దిగారు. వాహనంలో ఉన్న ఇద్దరు సాధువులను, డ్రైవర్ను బయటకు లాగి.. కర్రలు, రాడ్లు, రాళ్లతో కొట్టి చంపేశారు. అయితే సాధువులు వారి గురువు పరమపదించడంతో.. అంతిమ సంస్కారాలకు హాజరయ్యేందుకు వెళ్తున్నారని తెలిసింది.
అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చినా.. అక్కడే ఉండి కూడా ఆ సాధువులను, డ్రైవర్ను కాపాడలేకపోయారు. అయితే దొంగలు సంచరిస్తున్నారన్న పుకార్లతోనే ఈ దాడి జరిగిందని పోలీసులు చేతులు దులుపుకున్నారు. అయితే దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో.. ఒక్కసారిగా మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టించాయి.
సాధువులపై ఒక వర్గానికి చెందిన వారే కుట్రపూరితంగా దాడికి దిగారని.. పోలీసులు వచ్చాక కూడా.. విచక్షణా రహితంగా సాధువులపై దాడికి పాల్పడటమేంటని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో మహారాష్ట్ర సర్కార్ మేల్కొంది. దీంతో పాల్ఘర్ పోలీసులు ఘటనకు కారకులైన 110 మందిని అరెస్టు చేశారు. వీరిలో 9 మంది మైనర్లు కూడా ఉన్నట్లు తెలిపారు. వారిని జువెనైల్ హోమ్కు తరలించారు. మిగతా నిందితులందరికీ ఏప్రిల్ 30 వరకూ పోలీసుల కస్టడీలోనే ఉంటారని తెలిపారు. ఈ పుకార్లు ఎవరు సృష్టించారు. లాక్డౌన్ సమయంలో క్షణాల్లో అంత పెద్ద ఎత్తున ప్రజలు ఎలా గుమికూడారు..? అన్న విషయాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
కాగా.. పాల్ఘర్లో సాధువులపై జరిగిన దాడిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఉన్నతస్థాయి విచారణ జరిపి దోషులకు కఠిన శిక్షలు విధించాలని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. అటు ఇతర రాష్ట్రాల నేతలతో పాటు.. పలు హిందూ సంఘాలు కూడా ఈ ఘటనపై మండిపడుతున్నాయి.
The cruelty with which the mob lynching in #Palghar happened, is beyond inhuman. I demand a High Level Enquiry and strictest action be taken at the earliest.#Maharashtra #Mumbai pic.twitter.com/tnagputI7J
— Devendra Fadnavis (@Dev_Fadnavis) April 19, 2020
VIEWER DISCRETION ADVISED
Policemen who were present at the scene of the Palghar lynching & turned a blind eye should be tried for abetment to murder.
The high level inquiry announced by @AnilDeshmukhNCP must take cognisance of videos such as thesepic.twitter.com/4iK13oEiBP
— Milind Deora मिलिंद देवरा (@milinddeora) April 20, 2020