దిగ్విజయ్‌ సింగ్‌పై కేసు నమోదు

మార్ఫింగ్ వీడియోను షేర్ చేసిన ఘటనలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై మధ్యప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

దిగ్విజయ్‌ సింగ్‌పై కేసు నమోదు
Follow us

| Edited By:

Updated on: Jun 15, 2020 | 10:15 PM

మార్ఫింగ్ వీడియోను షేర్ చేసిన ఘటనలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై మధ్యప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దిగ్విజయ్ షేర్ చేసిన వీడియోలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ మధ్యపానాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉంది. దీనిపై బీజేపీ ఫైర్ అయింది. కాంగ్రెస్‌ హయాంలో మద్య విధానంపై శివరాజ్ సింగ్ మాట్లాడిన మాటలను దిగ్విజయ్ తారుమారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారని బీజేపీ నేత, మాజీ హోంమంత్రి ఉమాశంకర్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ట్వీట్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు, ఇతర ఆధారాలను పోలీసులకు అందజేశారు.

మరోవైపు ఫిర్యాదుపై క్రైమ్ బ్రాంచ్ అధికారి నిశ్చల్ ఝారియా మాట్లాడుతూ.. సోషల్ మీడియాను పర్యవేక్షించే సైబర్ విభాగం దిగ్విజయ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని అన్నారు. ఫోర్జరీ, పరువు నష్టం కేసుల్లో దిగ్విజయ్‌ను నిందితుడిగా చేర్చినట్లు ఆయన వెల్లడించారు. అయితే రాజకీయ కక్షతోనే ప్రభుత్వం తనపై కేసు నమోదు చేసిందని దిగ్విజయ్ మండిపడ్డారు. అసలు ఆ వీడియోను ఎవరు మార్ఫింగ్ చేశారో కూడా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Read This Story Also: Breaking: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు

Latest Articles