దైవదర్శనం చేసుకుని వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మ‌ృతి

విజయవాడ దుర్గమ్మ ను దర్శనం చేసుకుని తిరుపతి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం మృత్యుఒడికి చేరింది. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మెచర్ల వద్ద శుక్రవారం సాయంత్రం ఆగివున్న లారీని కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడిక్కడే మృత్యువు పాలయ్యారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా ఒకే కుంటుంబానికి చెందినవారుగా గుర్తించారు. వీరంతా తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌ జిల్లా వాసులుగా తెలుస్తోంది. మృతుల్లో కొంపల్లి లీలా-మలహల్‌రావు దంపతులు, వారి కూతురు అర్చన, అల్లుడు వంశీకృష్ణ […]

దైవదర్శనం చేసుకుని వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మ‌ృతి
Follow us

| Edited By:

Updated on: Aug 09, 2019 | 8:44 PM

విజయవాడ దుర్గమ్మ ను దర్శనం చేసుకుని తిరుపతి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం మృత్యుఒడికి చేరింది. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మెచర్ల వద్ద శుక్రవారం సాయంత్రం ఆగివున్న లారీని కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడిక్కడే మృత్యువు పాలయ్యారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా ఒకే కుంటుంబానికి చెందినవారుగా గుర్తించారు. వీరంతా తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌ జిల్లా వాసులుగా తెలుస్తోంది.

మృతుల్లో కొంపల్లి లీలా-మలహల్‌రావు దంపతులు, వారి కూతురు అర్చన, అల్లుడు వంశీకృష్ణ ఉన్నారు. అర్చన-వంశీకృష్ణ దంపతుల కుమారులు అద్వైత (7), కృషాణ్‌ (5) కూడా ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. విజయవాడలో దుర్గమ్మ దర్శనం చేసుకుని తిరుమలకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. మృతుడు వంశీకృష్ణ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా గతంలో పనిచేసేవాడని తెలుస్తోంది.