Stress Relief Tips: ఈ డ్రింక్ తాగారంటే.. జన్మలో ఒత్తిడి దరిచేరదు..

|

Jun 24, 2024 | 5:15 PM

ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఉరుకులు పరుగులు జీవితం అయిపోయింది. ఎవరి బిజీ వాళ్లదే. కాసేపు రిలాక్స్ అవ్వడానికి కూడా ఎక్కడా సమయం ఉండటం లేదు. దీంతో చాలా మందికి ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడిని అధికంగా తీసుకోవడం వల్ల అనేక రక రకాల సమస్యలను తలెత్తుకొనాల్సి వస్తుంది. ఒత్తిడి వల్ల ముఖ్యంగా బీపీ, షుగర్, అధిక బరువు సమస్యలు పెరుగుతాయి. ఇతర సమస్యలు ఎన్నో..

Stress Relief Tips: ఈ డ్రింక్ తాగారంటే.. జన్మలో ఒత్తిడి దరిచేరదు..
Stress Relief Tips
Follow us on

ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఉరుకులు పరుగులు జీవితం అయిపోయింది. ఎవరి బిజీ వాళ్లదే. కాసేపు రిలాక్స్ అవ్వడానికి కూడా ఎక్కడా సమయం ఉండటం లేదు. దీంతో చాలా మందికి ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడిని అధికంగా తీసుకోవడం వల్ల అనేక రక రకాల సమస్యలను తలెత్తుకొనాల్సి వస్తుంది. ఒత్తిడి వల్ల ముఖ్యంగా బీపీ, షుగర్, అధిక బరువు సమస్యలు పెరుగుతాయి. ఇతర సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఒత్తిడిని ఎదుర్కోవాలంటే.. సరైన ఆహారం తీసుకోవాలి. కొన్ని కొన్ని ఆహారాల వల్ల కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మనం అప్పుడప్పుడు ఉపయోగించే కుంకుమ పువ్వుతో చాలా సమస్యలను తగ్గించవచ్చు.

కుంకుమ పువ్వును పూర్వం నుంచి ఉపయోగిస్తున్నారు. అయితే కేవలం కడుపుతో ఉన్న సమయంలోనే యూజ్ చేస్తారు. కానీ తరచూ కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల చాలా రకాల సమస్యలను తగ్గించుకోవచ్చన్న విషయం ఎవరికీ తెలీదు. కుంకుమ పువ్వులో కూడా ఎన్నో రకాల పోషకాలు దాగి ఉన్నాయి. తరచూ కుంకుమ పువ్వు నీటిని తాగడం వల్ల పలు దీర్ఘకాలిక సమస్యలకు చెక్ పెట్టవచ్చని పోషకాహార నిపుణులు సైతం చెబుతున్నారు. మరి కుంకుమ పువ్వు నీటిని ప్రతిరోజూ తాగడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒత్తిడి దూరం:

కుంకుమ పువ్వు నీటిని తరచూ తాగడం వల్ల ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ఇందులో ఉండే కొన్ని సమ్మేళనాలు మెదడులోని సెరోటోనిన్ అనే హార్మోన్ స్థాయిలను పెంచేందుకు హెల్ప్ చేస్తుంది. నిరాశను తగ్గించి మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది.

ఇవి కూడా చదవండి

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం:

కుంకుమ పువ్వు నీటిని తాగడం వల్ల దీర్ఘకాలిక సమస్యలను తగ్గించుకోవచ్చు. వీటిల్లో పలు రకాల పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటీస్, బీపీ వంటి సమస్యల నుంచి కాపాడుతుంది.

జ్ఞాపక శక్తి పెరుగుతుంది:

కుంకుమ పువ్వు నీటిని తీసుకోవడం వల్ల మెదడు యాక్టివ్‌గా పని చేస్తుంది. దీంతో మతి మరుపు వంటి సమస్యలు తగ్గి.. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా మెదడుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..