Zombie Reddy Trailer: ప్రతి సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు.. ఈసారి జాంబీలు వస్తున్నారు.. మనిషిని మనిషే తింటే..
Zombie Reddy Trailer Out: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా 'జాంబి రెడ్డి' అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్..
Zombie Reddy Trailer Out: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా ‘జాంబి రెడ్డి’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్, పోస్టర్ల ద్వారా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇంత వరకు తెలుగులో రాని జోనర్లో ఈ సినిమా తెరకెక్కుతుండడం విశేషం. ఇప్పటి వరకు హాలీవుడ్ చిత్రాలకే పరిమితమైన జాంబి తరహా సినిమాను తొలిసారి టాలీవుడ్కు పరిచయం చేయనున్నాడు ప్రశాంత్ వర్మ. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోన్న క్రమంలో.. చిత్ర యూనిట్ ట్రైలర్ను విడుదల చేసింది. నటుడు ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు వైరల్గా మారింది. మనిషిని మనిషే తింటే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో జాంబి చిత్రంగా ప్రశాంత్ ఈ సినిమాను తీస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇంత సీరియస్ సబ్జెక్ట్లోనూ దర్శకుడు కామెడీని జోడించాడు. ఓవైపు మనుషుల పీకలు కొరుతున్న వీడియోలను చూపిస్తూనే కామెడీ పండించడం ప్రశాంత్కే దక్కింది. ఇక ‘ప్రతి సంక్రాంతికి అల్లుళ్లు వస్తుంటారు.. ఈసారి జాంబీలు వస్తున్నారు’ అన్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్లోని కొన్ని సన్నివేశాలను చూస్తుంటే ప్రశాంత్ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం భారీగానే రీసెర్చ్ చేసినట్లు అర్థమవుతోంది. మరి సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.
Also Read: Amazon Launches AmazonBasics Fire TV: అమెజాన్ బేసిక్స్ ఫైర్ టీవీ విడుదల.. అద్భుత ఫీచర్లు ఇవే..!