AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమలలో రేపటి నుంచే ఉచిత లడ్డూ…

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు రేపటినుంచి ఉచిత లడ్డూ అందించనున్నారు అధికారులు. స్వామి వారి దర్శనం చేసుకునే ప్రతి భక్తుడుకి ఒక లడ్డూ ఉచితంగా ఇస్తామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఓ అంచనా ప్రకారం రోజుకు దాదాపు 80,000 మంది భక్తులు తిరుమల వెంకన్నను దర్శించుకుంటారు. వారందరికీ కూడా ఉచిత లడ్డూ ఇవ్వనున్నారు.  గతంలో కేవలం నడకదారి ద్వారా వచ్చే భక్తులకు మాత్రమే ఈ సదుపాయం ఉండేది. ఇక అదనంగా లడ్డూ కావాలంటే […]

తిరుమలలో రేపటి నుంచే ఉచిత లడ్డూ…
అలాగే 35.26 లక్షల శ్రీవారి లడ్డూలు జులై మాసంలో విక్రయించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Ram Naramaneni
|

Updated on: Jan 19, 2020 | 4:53 PM

Share

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు రేపటినుంచి ఉచిత లడ్డూ అందించనున్నారు అధికారులు. స్వామి వారి దర్శనం చేసుకునే ప్రతి భక్తుడుకి ఒక లడ్డూ ఉచితంగా ఇస్తామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఓ అంచనా ప్రకారం రోజుకు దాదాపు 80,000 మంది భక్తులు తిరుమల వెంకన్నను దర్శించుకుంటారు. వారందరికీ కూడా ఉచిత లడ్డూ ఇవ్వనున్నారు.  గతంలో కేవలం నడకదారి ద్వారా వచ్చే భక్తులకు మాత్రమే ఈ సదుపాయం ఉండేది. ఇక అదనంగా లడ్డూ కావాలంటే ఒక్కో లడ్డూకు రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం తిరుమలలో 12 అదనపు లడ్డూ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా రోజుకు 4 లక్షల లడ్డూలు తయారు చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

Follow Us