అవినీతి తిమింగ‌ళం కేసు విచార‌ణ‌లో విస్తుపోయే వాస్త‌వాలు

|

Aug 15, 2020 | 2:32 PM

తెలంగాణలో భారీ అవినీతి తిమింగ‌ళం ఏసీబీకి చిక్కింది. ఇంత పెద్ద‌ మొత్తంలో ఓ రెవెన్యూ అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడటం ఇదే తొలిసార‌ని ప‌లువురు అధికారులు అభిప్రాయ‌ప‌డుత‌న్నారు.

అవినీతి తిమింగ‌ళం కేసు విచార‌ణ‌లో విస్తుపోయే వాస్త‌వాలు
Follow us on

తెలంగాణలో భారీ అవినీతి తిమింగ‌ళం ఏసీబీకి చిక్కింది. ఇంత పెద్ద‌ మొత్తంలో ఓ రెవెన్యూ అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడటం ఇదే తొలిసార‌ని ప‌లువురు అధికారులు అభిప్రాయ‌ప‌డుత‌న్నారు. వివాదంలో ఉన్న‌ ఓ 28 ఎక‌రాలు భూ వ్యవహారంలో రియ‌ల్ ఎస్టేస్ వారికి అనుకూలంగా పాస్‌బుక్ ఇచ్చేందుకు భారీ మొత్తంలో నగదు తీసుకుంటున్న కీసర మండ‌ల‌ తాహసీల్దార్‌ నాగ‌రాజునును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మొత్తం 2 కోట్ల రూపాయల లంచం డిమాండ్‌ చేసి.. కోటి 10లక్షల రూపాయలు తీసుకుంటున్న అత‌డిని అధికారులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అత‌డికి లంచం ఇచ్చిన ఇద్దరు రియల్‌ఎస్టేట్‌ డెవలపర్లను, వీఆర్ఏను సైతం అధికారులు అరెస్టు చేశారు. గ‌తంలో ఈ త‌హ‌సీల్దార్‌పై ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్నాడ‌ని కేసులు న‌మోదై ఉన్నాయి.

విచార‌ణ‌లో కీసర ఎమ్మార్వో కేసులో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కి వ‌స్తున్నాయి. అత‌డి ఆస్తుల విలువ‌ 100 కోట్ల పైచిలుకు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో అత‌డు పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు, అమ్మకాలు జ‌రిపిన‌ట్టు గుర్తించారు. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో పెద్దగా భూములు క‌లిగిఉన్న‌ట్లు నిర్ధారించారు. ఎంఆర్ఓ నాగరాజు ఇంట్లో రెండు కిలోల బంగారు ఆభరణాలను, రెండు బ్యాంకుల లాకర్ల‌ను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు.

Also Read : రోనా టీకాపై ప్రధాని మోదీ స్ప‌ష్ట‌త‌