తెలంగాణ సీఎస్తో బిల్డర్స్, కాంట్రాక్టర్ల అసోసియేషన్ నేతల భేటీ.. పెండింగ్ సమస్యల పరిష్కరించాలని విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు సీఎస్ సోమేశ్కుమార్తో భేటీ అయ్యారు.
తెలంగాణ అభివృద్ధిలో బిల్డర్లు, కాంట్రాక్టర్లు భాగస్వాములుగా ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు సీఎస్ సోమేశ్కుమార్తో భేటీ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఏస్టేట్ వ్యాపారం పుంజుకుందని, నిర్మాణపనులు వేగంగా సాగుతున్నట్లు అసోసియేషన్ సభ్యులు సీఎస్కు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించడానికి కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించాలని ఈ సందర్భంగా వారు సీఎస్ సోమేశ్కుమార్ను కోరారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బిల్డర్లు, కాంట్రాక్టర్లను అభివృద్ధిలో భాగస్వాములుగా భావిస్తారని, త్వరలో వారితో చర్చలు జరపనున్నట్టు తెలిపారు. సమస్యలన్నింటిని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని సీఎస్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో పలువురు అసోసియేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.