కొన్ని సంఘ విద్రోహ శక్తుల పనే ఇది ! ఢిల్లీ ఘర్షణలపై సంయుక్త కిసాన్ మోర్చా స్పందన

కొన్ని సంఘ విద్రోహ శక్తులు మా నిరసన ఉద్యమంలో పాల్గొన్న ఫలితంగానే మంగళవారం ఢిల్లీ నగరంలో పెద్ద ఎత్తున హింసాత్మక వాతావరణం  ఏర్పడిందని..,

కొన్ని సంఘ విద్రోహ శక్తుల పనే ఇది ! ఢిల్లీ ఘర్షణలపై సంయుక్త కిసాన్ మోర్చా స్పందన
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 26, 2021 | 4:15 PM

కొన్ని సంఘ విద్రోహ శక్తులు మా నిరసన ఉద్యమంలో పాల్గొన్న ఫలితంగానే మంగళవారం ఢిల్లీ నగరంలో పెద్ద ఎత్తున హింసాత్మక వాతావరణం  ఏర్పడిందని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు అన్నారు. నిజానికి తాము శాంతియుతంగా తమ ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించాలనుకున్నామని, కానీ ఈ శక్తుల కారణంగా పరిస్థితి చెయ్యి దాటిపోయిందని వారన్నారు. అవాంఛనీయ ఘటనలను తాము ఖండిస్తున్నామని, మళ్ళీ ఈ విధమైనవి జరగకుండా చూస్తామని వారన్నారు. ఈ అల్లర్లలో కొందరు రైతులు,  పోలీసులు కూడా గాయపడడం పట్ల వారు విచారం వ్యక్తం చేశారు. అటు- ఘాజీపూర్ బోర్డర్లో ఇద్దరు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. నగరంలో పరిస్థితి ఇంకా నివురుగప్పిన నిప్పులా ఉంది.