షాకింగ్ న్యూస్..మిడతలు ఒక్కరోజులో 35వేలమంది ఆహారాన్ని లాగించేస్తున్నాయ్..
ఇండియాను ఇప్పుడు కరోనాతో పాటు మిడతలు కూడా దెబ్బతీస్తున్నాయి. కరోనా ఇబ్బందులు పెట్టని రంగం కొద్దొ, గొప్పో ఏదైనా రంగం ఉందంటే అది వ్యవసాయమే. కానీ భారత్ లోని కొన్ని రాష్ట్రాల్లో మిడతలు ఇప్పుడు రైతుల పాలిట రాక్షసులుగా మారాయి. పంట ఏదైనయినా సంబంధం లేకుండా..పచ్చగా కనపడిన దాన్నల్లా ఆరగించేస్తున్నాయి. ఒక్కసారే లక్షల సంఖ్యలో పంటపై దాడిచేసి..అక్కడ పైరు వేశామన్న ఆనవాలు కూడా లేకుండా చేస్తున్నాయి. అటువంటి మిడతల గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం […]
ఇండియాను ఇప్పుడు కరోనాతో పాటు మిడతలు కూడా దెబ్బతీస్తున్నాయి. కరోనా ఇబ్బందులు పెట్టని రంగం కొద్దొ, గొప్పో ఏదైనా రంగం ఉందంటే అది వ్యవసాయమే. కానీ భారత్ లోని కొన్ని రాష్ట్రాల్లో మిడతలు ఇప్పుడు రైతుల పాలిట రాక్షసులుగా మారాయి. పంట ఏదైనయినా సంబంధం లేకుండా..పచ్చగా కనపడిన దాన్నల్లా ఆరగించేస్తున్నాయి. ఒక్కసారే లక్షల సంఖ్యలో పంటపై దాడిచేసి..అక్కడ పైరు వేశామన్న ఆనవాలు కూడా లేకుండా చేస్తున్నాయి. అటువంటి మిడతల గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
- ప్రస్తుతం ఇండియాలోని పంటపొలాలపై దండెత్తిన మిడతలు మన ఇంటి పరిసరాల్లో చూసే మిడతల మాదిరిగానే ఉంటాయి. కాకపోతే వేలు, లక్షల సంఖ్యలో ఒక్కసారిగా పంటపై దాడి చేస్తాయి. మిడతలు కేవలం మొక్కలను మాత్రమే ఆరగిస్తాయి. పొడి వాతావరణంలో ఇవి ఎక్కువగా సంచారం సాగిస్తాయి.
- చీమ తనకన్నా ఎక్కువ బరువును మోసినట్టు..మిడతా తన బరువుకన్నా ఎక్కువగా ఆహారం తినగలదు. ఇవి పంటలపై గుంపుగా దాడిచేస్తే..తెల్లారే సరికి పైరు ఆనవాళ్లు కూడా కనిపించవ్.
- ఈ మిడతలో ఒక రోజులో 150కి.మీ. వరకూ ఇవి ప్రయాణిస్తాయట. ఎక్కువ సమయం గాలిలో ఎగురుతూ కూడా ఉండగలవు. వర్షం కురిస్తే వాటి సంతోనోత్పత్తి పెరిగుతుంది.
- కిలోమీటరు పరిధి గల ప్రాంతాన్ని 80మిలియన్ల మిడతలు ఆక్రమించగలవు. ఇవి 35వేలమందికి సరిపోయే ఆహారాన్ని సింగిల్ డేలో ఖతం చేస్తాయి.
- వీటి సంతానోత్పత్తి ఊహకందని విధంగా ఉంటుంది. మూడు నెలల్లో ఇవి 20రెట్లు… ఆరు నెలల్లో 400 రెట్లు..9నెలల్లో 8వేల రెట్లకు ఇవి పెరిగిపోతాయి.
- ప్రస్తుతం ఇండియాపై ఈ మిడతల జన్మస్థానం తూర్పు ఆఫ్రికా, సూడాన్., అవి అక్కడి నుంచి మొదలై సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్థాన్కు వచ్చాయి. పాక్ నుంచి ఇప్పుడు మనదేశంలోకి ప్రవేశించాయి.
- ప్రపంచంలోని ఇతర వలస కీటకాలతో పోలిస్తే, మిడతల దండు అత్యంత ప్రమాదకరమైనది. వీటి వల్ల ఆహార సంక్షోభం ఏర్పడుతుందని యునైటెడ్ నేషన్స్కు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.